Dilsukhnagar Twin Blasts Case: దిల్ సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసు..ఐదుగురు దోషులకు ఉరిశిక్ష: హైకోర్టు తీర్పు
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ సహా నిందితులు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన అసదుల్లా అక్తర్ (యూపీ), జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తహసీన్ అక్తర్ (బీహార్), అజాజ్ షేక్ (మహారాష్ట్ర)లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది.

Dilsukhnagar Twin Blasts Case: హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. ఈ కేసులోని ప్రధాన నిందితుడు యాసిన్ భత్కల్ సహా నిందితులు ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రసంస్థకు చెందిన అసదుల్లా అక్తర్ (యూపీ), జియా-ఉర్-రెహమాన్ (పాకిస్థాన్), తహసీన్ అక్తర్ (బీహార్), అజాజ్ షేక్ (మహారాష్ట్ర)లకు ఉరిశిక్ష ఖరారు చేసింది. ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2016లో ఎన్ఐఏ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిందితులు ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టులో నిందితులు సవాల్ చేశారు. దీనిపై విచారణలు ఇప్పటికే ముగిశాయి. మంగళవారం హైకోర్టు తీర్పు వెల్లడించింది. జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ సుధల ధర్మాసనం 45 రోజులపాటు వాదనల అనంతరం తీర్పు వెల్లడించింది.
ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ప్రధాన నిందితుడు.. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ప్రస్తుతం రియాజ్ భత్కల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు పోలీసులు గుర్తించారు. కర్ణాటకకు చెందిన రియాజ్ భత్కల్పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది. వీరిపై ఇతర దేశాల్లో కూడా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.
జంటబాంబు పేలుళ్లు
హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో 2013 ఫిబ్రవరి 21వ తేదీన జంట బాంబుపేలుళ్ల ఘటన జరిగింది. మొదటి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో దిల్సుఖ్నగర్లోని 107 నంబరు గల బస్స్టాప్ వద్ద జరిగింది. మరికొద్ది నిమిషాల వ్యవధిలో కోణార్క్ థియేటర్ సమీపంలోని ఏ-1 మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు సంభవించింది. ఈ పేలుళ్ల దాటికి మొత్తం 18 మంది మృత్యువాతపడగా, 131 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళ, ఆమె గర్భంలో ఉన్న శిశువుకు కూడా గాయాలయ్యాయి. టిఫిన్బాక్స్లో బాంబు పెట్టి ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడులకు పాల్పడింది. ఈ పేలుళ్లపై మలక్ పేట, సరూర్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, అప్పట్లో దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకు అప్పగించింది. దీంతో ఎన్ఐఏకు ఈ కేసులు బదిలీ అయ్యాయి. దీంతో సుదీర్ఘ విచారణ అనంతరం ఈ దాడులకు పాల్పడింది ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ అని నిర్ధారించారు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ సహ వ్యవస్థాపకుడు రియాజ్ భత్కల్ను ప్రధాన సూత్రధారిగా నిర్ధారించింది. ఎన్ఐఏ అధికారులు 157 మంది సాక్షులను విచారించి కోర్టుకు 5వేల పేజీలకు పైగా ఛార్జిషీట్ దాఖలు చేసింది. వాదనలు విన్న ఎన్ఐఏ స్పెషల్ ట్రాక్ కోర్టు 2016 డిసెంబర్ 13న దోషులకు ఉరిశిక్ష విధించింది. తాజాగా హైకోర్టు ఆ తీర్పును సమర్థిస్తూ నిందితులకు ఉరిశిక్షను ఖాయం చేసింది.