Telangana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. పంట నష్టం పరిహారం విడుదల! త్వరలో ఖాతాల్లో జమ

Telangana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. పంట నష్టం పరిహారం విడుదల! త్వరలో ఖాతాల్లో జమ

–  51.528 కోట్ల నిధులను మంజూరు చేసిన ప్రభుత్వం
–  త్వరలోనే రైతుల ఖాతాల్లో నగదు చేసే అవకాశం
– అకాలవర్షాలతో 5.528 ఎకరాల్లో పంటనష్టం

Telangana Govrenment: 

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో గత రెండు నెలలుగా వడగళ్ల వాన, అకాలవర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం విడుద‌ల చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వ్యవసాయశాఖ పంటనష్టాన్ని అంచనవేసి ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇటీవల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

దీంతో రైతులకు నేరుగా వారి ఖాతాల్లోనే పరిహారం డబ్బులు జమకాబోతున్నాయి. 29 జిల్లాల్లో 5,528 ఎకరాలలో పంట నష్టం సంభవించిందని అధికారులు అంచనా వేశారు. మొత్తం 41,361 మంది రైతులకు పరిహారం అందజేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 51.528 కోట్లు నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను సంబంధిత విభాగాలతో సమన్వయం చేసుకొని త్వరలోనే నష్టపోయిన రైతుల ఎకౌంట్లలో జమ చేయడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వరి 36,424 ఏకరాలు, మొక్కజొన్న 3,266 ఎకరాలు, జొన్న 470 ఎకరాలు, ఉద్యాన పంటలు 6,589 ఎకరాలు, ప్రత్తి 4753 ఎకరాలలు మరియు ఇతర పంటలు 477 ఎకరాలలో (ప్రాణహిత వరదల మూలంగా సంభందించిన నష్టం) పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేసారు.