Singapore సింగపూర్: చట్టాలను రూపొందించడమేకాదు, వాటిని కఠినంగా అమలు చేయడంలో సింగపూర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే సింగపూర్లో అవినీతికి పాల్పడాలన్నా, అక్రమాలు చేయాలన్న ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఆధారాలతో దొరికారంటే, వారు ఎంతటివారైనా శిక్ష తప్పదు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మరణ శిక్ష పడిన ఇద్దరు దోషులను సింగపూర్ ఈ వారం ఉరితీయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. సింగపూర్లో ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం గత 20 ఏళ్లలో […]
Singapore
సింగపూర్: చట్టాలను రూపొందించడమేకాదు, వాటిని కఠినంగా అమలు చేయడంలో సింగపూర్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే సింగపూర్లో అవినీతికి పాల్పడాలన్నా, అక్రమాలు చేయాలన్న ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. ఆధారాలతో దొరికారంటే, వారు ఎంతటివారైనా శిక్ష తప్పదు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులో మరణ శిక్ష పడిన ఇద్దరు దోషులను సింగపూర్ ఈ వారం ఉరితీయనుంది. ఇందులో ఓ మహిళ కూడా ఉంది. సింగపూర్లో ఓ మహిళకు ఉరిశిక్ష అమలు చేయడం గత 20 ఏళ్లలో ఇది తొలిసారి.
50 గ్రాముల హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసిన కేసులో దోషిగా తేలిన 56 ఏళ్ల వ్యక్తిని ఈ బుధవారం (జూలై 26) చాంగీ జైలులో ఉరితీయనున్నట్లు స్థానిక హక్కుల సంస్థ ట్రాన్స్ఫర్మేటివ్ జస్టిస్ కలెక్టివ్ (టీజేసీ) వెల్లడించింది. ఇక, వచ్చే శుక్రవారం (జూలై 28) 45 ఏళ్ల మహిళ సారిదేవి దామనికి కూడా ఉరిశిక్ష అమలు చేయనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. 30 గ్రాముల హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసిన కేసులో సారిదేవి దోషిగా తేలడంతో 2018లో ఆమెకు ఉరిశిక్ష విధించారు.
ఉరిశిక్ష అమలు తేదీలపై ఇప్పటికే వారి కుటుంబాలకు నోటీసులు పంపించారని టీజేసీ పేర్కొంది. గతంలో డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో 36 ఏళ్ల మహిళ యెన్ మే వుయెన్కు 2004లో ఉరిశిక్ష అమలు చేశారు. సింగపూర్లో హత్యలు, కిడ్నాప్ల వంటి తీవ్రమైన నేరాలకు మరణ శిక్షలు విధిస్తారు. ఇక, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు కూడా అత్యంత కఠిన చట్టాలను అమలు చేస్తున్నారు.
500 గ్రాముల కంటే ఎక్కువ గంజాయి, 15 గ్రాముల కంటే ఎక్కువ హెరాయిన్ను అక్రమంగా రవాణా చేసిన కేసుల్లో దోషులకు మరణశిక్ష తప్పదు.కరోనా కారణంగా రెండేళ్ల పాటు మరణశిక్షల అమలును నిలిపివేసిన సింగపూర్.. ఈ మధ్య మళ్లీ శిక్షల అమలు చేపట్టింది. అలా ఇప్పటివరకు 13 మందిని ఉరితీసింది. ఆ మధ్య ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు కూడా మరణశిక్ష అమలు చేసిన విషయం తెలిసిందే.