Gold Rates | కొనుగోలుదారులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..!
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు దిగివస్తుండడంతో సామాన్యులకు ఊరట కలిగిస్తున్నాయి

Gold Rates | బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు షాక్ ఇచ్చాయి. నిన్న స్వల్పంగా దిగి వచ్చిన ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్పై రూ.700 తగ్గి.. తులానికి రూ.59,450కి చేరింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.760 పెరిగి.. రూ.64,850కి చేరింది. అదే సమయంలో వెండి సైతం భారీగా పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.60,150 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,620కి పెరిగింది.
ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.64,850కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.59,600 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65వేలకు ఎగిసింది. హైదరాబాద్లో 22 క్యారెట్ల పసిడి రూ.59,450 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ రూ.64,850 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర భారీగా పెరిగింది. కిలోకు రూ.1100కి పెరిగింది.
హైదరాబాద్లో వెండి కిలోకు రూ.78,200 పెరిగింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.