Gold Rates | షాకిస్తున్న బంగారం.. మళ్లీ పెరిగిన పసిడి ధర..!

బంగారం, వెండి ధరలు షాక్‌ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజూ ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 పెరిగి.. తులానికి రూ.59,460కి పెరిగింది.

Gold Rates | షాకిస్తున్న బంగారం.. మళ్లీ పెరిగిన పసిడి ధర..!

Gold Rates | బంగారం, వెండి ధరలు షాక్‌ ఇస్తున్నాయి. వరుసగా రెండోరోజూ ధరలు పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.10 పెరిగి.. తులానికి రూ.59,460కి పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి.. రూ.64,860కి ఎగిసింది. అదే సమయంలో వెండి పెరిగింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.60,160 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,630కి చేరింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.59,460 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.64,860కి పెరిగింది.

ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.59,610 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,010 ఎగిసింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.59,460 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.64,860 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో వెండి ధర భారీగా పెరిగింది. కిలోకు రూ.100కి పెరిగింది.

హైదరాబాద్‌లో వెండి కిలోకు రూ.78,300 పెరిగింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.