Gold Rates | బంగారం జోరు.. కొనుగోలుదారులు బేజారు..! మళ్లీ పెరిగిన పసిడి ధర..!

బంగారం జోరు కొనసాగుతున్నది. వరుసగా మూడోరోజు ధర పెరిగింది. 22 క్యారెట్లపై బంగారంపై రూ.400 పెరిగి తులం రూ.60,100 పలుకుతున్నది

  • By: Somu    latest    Mar 07, 2024 10:24 AM IST
Gold Rates | బంగారం జోరు.. కొనుగోలుదారులు బేజారు..! మళ్లీ పెరిగిన పసిడి ధర..!

Gold Rates | బంగారం జోరు కొనసాగుతున్నది. వరుసగా మూడోరోజు ధర పెరిగింది. 22 క్యారెట్లపై బంగారంపై రూ.400 పెరిగి తులం రూ.60,100 పలుకుతున్నది. 24 క్యారెట్ల పసిడిపై సైతం రూ.430 పెరిగి రూ.65,560కి ఎగిసింది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.60,900 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.66,440కి పెరిగింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.60,100 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.65,560కి చేరింది. ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.60,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,750కి పెరిగింది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.60,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.65,560 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు మళ్లీ వెండి ధర సైతం స్థిరంగానే ఉన్నది. మరో వైపు వెండి ధర సైతం భారీగానే పెరిగింది. రూ.500 పెరిగి కిలోకు రూ.75వేలకు ఎగిసింది. హైదరాబాద్‌లో వెండి కిలో రూ.78,500 పలుకుతున్నది.


వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈక్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.