స్వల్పంగా పెరిగిన పసిడి..! హైదరాబాద్‌లో నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. నిన్న మొన్న స్వల్పంగా దిగిన వచ్చిన ధర మరోసారి స్వల్పంగా పెరిగింది.

స్వల్పంగా పెరిగిన పసిడి..! హైదరాబాద్‌లో నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

విధాత‌: పసిడి ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయికి చేరాయి. నిన్న మొన్న స్వల్పంగా దిగిన వచ్చిన ధర మరోసారి స్వల్పంగా పెరిగింది. 22 క్యారెట్ల గోల్డ్‌పై రూ.150 పెరిగి.. తులం రూ.57,700 పలుకుతున్నది. 24 క్యారెట్ల బంగారంపై రూ.170 పెరగడంతో రూ.62,950కి చేరింది.


దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.57,850 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,100 పలుకుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.62,950కి పెరిగింది. చెన్నైలో 22 క్యారెట్ల పుత్తడి రూ.58,350 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,660 వద్ద కొనసాగుతున్నది.


ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.62,950కి చేరింది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం నగరాల్లోనే ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వెండి వెండి ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.80వేలు పలుకుతున్నది.