విధాత: వైఎస్సార్ జమానాలో పదేళ్లపాటు అమలాపురం ఎంపీగా పనిచేసి ఆ తరువాత స్తబ్దుగా ఉన్న హర్షకుమార్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా… ఆయన ప్లాన్ ఏమిటి.. అర్థం కావడం లేదు. అయితే వైసిపి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్లి హర్ష కుమార్ ను కలవడంతో మళ్లీ ఆయన యాక్టివ్ అవుతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 2004 - 2009లో అమలాపురం నుంచి ఎంపీగా హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత […]
విధాత: వైఎస్సార్ జమానాలో పదేళ్లపాటు అమలాపురం ఎంపీగా పనిచేసి ఆ తరువాత స్తబ్దుగా ఉన్న హర్షకుమార్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నారా… ఆయన ప్లాన్ ఏమిటి.. అర్థం కావడం లేదు. అయితే వైసిపి రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్లి హర్ష కుమార్ ను కలవడంతో మళ్లీ ఆయన యాక్టివ్ అవుతున్నారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
2004 – 2009లో అమలాపురం నుంచి ఎంపీగా హర్షకుమార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఆ తరువాత 2014లో కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పండుల రవీంద్రబాబు చేతిలో ఓడిపోయారు. మళ్లీ 2019 ఎన్నికల సమయంలో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించి ఓ దశలో, ఓ సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు కాళ్లు మొక్కినా 2019లో టికెట్ దక్కలేదు. ఆ ఎన్నికల్లో బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ కు టీడీపీ టికెట్ ఇవ్వగా
వైసీపీ అభ్యర్థి చింతా అనురాధ గెలిచారు.
.2019 ఎన్నికల తర్వాత హరీష్ కుమార్ సైలెంట్ గా ఉంటూనే అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ మీద విమర్శల దాడి చేస్తూనే వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆయన్ను తమ పార్టీ నేతగానే పరిగణిస్తూ ఈమధ్య పీసీసీలో ఓ ప్రధాన పోస్టును కేటాయించగా దాన్ని ఆయన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ఆయనను వైసీపీలోకి తీసుకునే అవకాశాలు ఉండొచ్చని అంటున్నారు. మరో ఆసక్తికర విషయం ఏంటంటే ఆయనను కలిసేందుకు పిల్లి సుభాష్ చంద్రబోస్ వెళ్లారని అంటున్నారు. ఇక మున్ముందు ఏమవుతుందో చూడాలి.