MLA Rajaiah | విధాత, వరంగల్: భూమి కొని, మొట్లు కొట్టి, దుక్కి దున్ని, నారుపోసి, నాటువేసి, వరి కోసి, రాసి పోశాకా ఎవరో వచ్చి నా పంట కుప్పపై కూర్చుంటానంటే ఊరుకుంటానా అంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ధర్మసాగర్ మండలంలో బీసీ బంధు చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ దుక్కి దున్ని, నారు పోసేటప్పుడు తనతో సహకరిస్తే అది వేరే విషయమని, పంట పండించాకా వస్తే ఎలా […]
MLA Rajaiah |
విధాత, వరంగల్: భూమి కొని, మొట్లు కొట్టి, దుక్కి దున్ని, నారుపోసి, నాటువేసి, వరి కోసి, రాసి పోశాకా ఎవరో వచ్చి నా పంట కుప్పపై కూర్చుంటానంటే ఊరుకుంటానా అంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ధర్మసాగర్ మండలంలో బీసీ బంధు చెక్కుల పంపిణీలో కార్యక్రమంలో రాజయ్య మాట్లాడుతూ దుక్కి దున్ని, నారు పోసేటప్పుడు తనతో సహకరిస్తే అది వేరే విషయమని, పంట పండించాకా వస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.
ఏదీ ఏమైనా దేవుడు ఉన్నాడని, దేవుడి లాంటి సీఎం కేసీఆర్ ఉన్నాడని, రేపో మాపో మనం అనుకున్న కార్యక్రమం జరుగబోతుందన్నారు. ఆరు నూరైనా నా ప్రాణం అడ్డేసి మీ అందర్నీ కాపాడుకుంటానని, రాబోయే రోజుల్లో ప్రజాజీవితంలో ఉంటానన్నారు. మీకోసం నేను ఉన్నానని, మీ మధ్యలోనే చచ్చిపోతానని కీలక వ్యాఖ్యలు చేశారు.
సిటింగ్ ఎమ్మెల్యే రాజయ్య టికెట్ను బీఆరెస్ తొలి జాబితాలో సీఎం కేసీఆర్ కట్ చేసి మాజీ మంత్రి కడియం శ్రీహరికి కేటాయించారు. తనకు టికెట్ రాకపోవడంతో ఇటీవల అంబేద్కర్ విగ్రహం కాళ్ల వద్ద పడి రాజయ్య బోరున ఏడ్చాడు.
బుజ్జగింపుల కోసం కేసీఆర్ దూతగా పల్లా రాజేశ్వర్రెడ్డి ఇంటికొస్తే ముఖం చాటేశారు. మళ్లీ ప్రజాజీవితంలో ఉంటానంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన కూడా రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తారేమోనన్న సందేహాలు వినిపిస్తున్నాయి.