విధాత: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. దేశం ఆత్మనిర్భర్ భారత్గా ఆవిర్భవిస్తున్నదని, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు. ఇప్పుడు యావత్ ప్రపంచం ఆశావహ దృక్పథంతో చూస్తున్నదని, రాబోయే 25 ఏళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడలన్నారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందన్నారు. సాంకేతికను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని […]
విధాత: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగించారు. దేశం ఆత్మనిర్భర్ భారత్గా ఆవిర్భవిస్తున్నదని, పౌరులందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఈ సందర్భంగా రాష్ట్రపతి తెలిపారు. తొమ్మిదేళ్ల ప్రభుత్వ పాలనలో పౌరుల ఆత్మవిశ్వాసం పెరిగిందన్నారు.
ఇప్పుడు యావత్ ప్రపంచం ఆశావహ దృక్పథంతో చూస్తున్నదని, రాబోయే 25 ఏళ్లలో వికసిత భారతం దిశగా అడుగులు పడలన్నారు. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైందన్నారు. సాంకేతికను అందిపుచ్చుకుని నూతన ఆవిష్కరణలు తీసుకొస్తున్నామని రాష్ట్రపతి తెలిపారు. ఆయుష్మాన్ భారత్ వంటి మెరుగైన పథకాలు తీసుకొచ్చామన్నారు. డిజిటల్ ఇండియా దిశగా భారత్ దూసుకుపోతున్నదని అన్నివర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్నదన్నారు.
రాష్ట్రప్రతి ప్రసంగంలోని ముఖ్యమైన అంశాలు..
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నమోదవుతున్నాయి. ప్రపంచానికి పరిష్కారాలు చూపేలా భారత్ తయారైంది. మూడు కోట్ల మందికి సొంత ఇళ్లు నిర్మించాం. మహిళా సాధికారతను ప్రోత్సహించాం. చిన్న, సన్నకారు రైతులను ఆదుకుంటున్నాం.ఫసల్ బీమా యోజన, కిసాన్ కార్డు వంటి పథకాలు తీసుకొచ్చాం. పంట నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్నాం.కనీస మద్దతు ధర పెంచి రైతులను బలోపేతం చేస్తున్నాం.
ఆదివాసీ ప్రాంతాల్లో ఆదర్శపాఠశాలు ఏర్పాటు చేశాం. తొలిసారిగా బిర్సాముండా జయంతి ఉత్సవాలు జరిపాం. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం.తీవ్రవాద ప్రభావిత జిల్లాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నాం. ఈశాన్యరాష్ట్రాలు, సరిహద్దు గ్రామాల్లో రక్షణ చర్యలు చేపట్టామని తెలిపారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోడీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ కోసం ఎదురు చూస్తోందని, ప్రపంచంలో నెలకొన్న అనిశ్చితి అందుకు కారణమన్నారు.కాగా.. బీఆర్ఎస్, ఆప్ ఎంపీలు రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించగా.. కొందరు కాంగ్రెస్ ఎంపీలు భారత్ జోడో యాత్ర ముగింపులో పాల్గొని శ్రీనగర్లో మంచు కారణంగా చిక్కుకుని హాజరు కాలేకపోయారు.