అమెరికా రాష్ట్రంలోని మసాచుసెట్స్లోని అత్యంత ఖరీదైన (5 మిలియన్ డాలర్లు) రూ.41.62 కోట్ల విలువైన భవనంలో అనుమానాస్పదస్థితిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి.
విధాత: అమెరికా రాష్ట్రంలోని మసాచుసెట్స్లోని అత్యంత ఖరీదైన (5 మిలియన్ డాలర్లు) రూ.41.62 కోట్ల విలువైన భవనంలో అనుమానాస్పదస్థితిలో ముగ్గురి మృతదేహాలు లభించాయి. భారతీయ సంతతికి చెందిన సంపన్న కుటుంబానికి చెందిన దంపతులతోపాటు కుమార్తె చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. రాకేశ్కమల్ (57), ఆయన భార్య టీనా (54), వారి 18 ఏండ్ల కుమార్తె అరియానా మృతదేహాలు వారి డోవర్ మాన్షన్లో గురువారం రాత్రి 7:30 గంటలకు గుర్తించారు. డోవర్ మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ డౌన్టౌన్కు నైరుతి దిశలో 32 కిలోమీటర్ల దూరంలో ఈ బంగ్లా ఉన్నది.
భారత సంతతి దంపతులు రిక్ అనే వ్యక్తి ద్వారా అమెరికాకు వెళ్లారు. ఎడ్యునోవా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నిర్వహిస్తున్నారు. భయంకరంగా రక్తపు మడుగులో మృతదేహాలు పడి ఉన్నాయని అధికారులు తెలిపారు. రాకేశ్ మృతదేహం దగ్గర తుపాకీ కనిపించిందని చెప్పారు. ముగ్గురు కుటుంబ సభ్యులు తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా చంపారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. అయితే, ఈ జంట ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొన్నట్టు ఆన్లైన్ రికార్డులు వెల్లడిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఒకటి, రెండు రోజుల నుంచి వీరికి బంధువులు ఫోన్ చేసినా ఎవ్వరూ స్పందించకపోవడంతో వారి బంధువు భవనంలోకి వెళ్లి పరిశీలించగా, ఈ భయానక ఘటన వెలుగులోకి వచ్చినట్టు తెలిపారు.