IPL: బెంగళూరు బోణీ.. ముంబయిపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం
విధాత: ఐపీఎల్ 16 వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో బెంగళూరు బోణీ కొట్టింది. ముంబయితో జరిగిన పోరలో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆర్బీసీ కేవలం 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. బెంగళూరు జట్టులో ఓపెనర్లు కోహ్లీ (82 నాటౌట్ 42 బంతుల్లోనే), డుప్లెసిస్ (73, 43 బంతుల్లో) దంచికొట్టారు. తొలుత బ్యాటింగ్ చేసిన […]

విధాత: ఐపీఎల్ 16 వ సీజన్లో అద్భుత ప్రదర్శనతో బెంగళూరు బోణీ కొట్టింది. ముంబయితో జరిగిన పోరలో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి జట్టు నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఆర్బీసీ కేవలం 16.2 ఓవర్లలోనే 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
బెంగళూరు జట్టులో ఓపెనర్లు కోహ్లీ (82 నాటౌట్ 42 బంతుల్లోనే), డుప్లెసిస్ (73, 43 బంతుల్లో) దంచికొట్టారు.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. తిలక్వర్మ (84, 46 బంతుల్లో) మెరుపులు మెరిపించాడు.