సెయిల్‌ యూనిట్ల విక్ర­యా­నికి బ్రేక్‌.. మరి విశాఖ ఉక్కు పరిస్థితి?

స్టీల్‌ అథా­రిటీ ఆఫ్‌ ఇండియా యూని­ట్లపై నెల­కొన్న అని­శ్చి­తికి కేంద్ర ప్రభు­త్వమే పూర్తిగా బాధ్యత వహిం­చా­లని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు.

  • Publish Date - January 5, 2024 / 12:21 PM IST

న్యూఢిల్లీ : స్టీల్‌ అథా­రిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) యూని­ట్లపై నెల­కొన్న అని­శ్చి­తికి ప్రధాని నరేం­ద్ర­మోదీ నాయ­క­త్వం­లోని కేంద్ర ప్రభు­త్వమే పూర్తిగా బాధ్యత వహిం­చా­లని కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అన్నారు. ఈ మేరకు శుక్ర­వారం ఎక్స్‌లో ఆయన ఒక పోస్ట్‌ పెట్టారు. సెయిల్‌ ప్రైవే­టీ­క­రణ నిలి­చి­పో­యి­న­ట్టు­న్న­దని వ్యాఖ్యా­నిం­చారు. ‘ఐదేళ్ల క్రితం మూడు సెయిల్‌ యూనిట్లు.. దుర్గా­పూర్‌ అల్లా­యిస్‌ స్టీల్‌ ప్లాంట్‌, భద్రా­వ­తి­లోని విశ్వే­శ్వ­రయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌, సేలం స్టీల్‌ ప్లాంట్‌­లను తెగ­న­మ్మా­లని మోదీ ప్రభుత్వం నిర్ణ­యిం­చింది.


ఇప్పుడు వాటి ప్రైవే­టీ­క­రణ నిలి­చి­పో­యి­నట్టు కని­పి­స్తు­న్నది. ప్రైవే­టీ­క­ర­ణకు వ్యతి­రే­కంగా నిక­రంగా ఉద్య­మిం­చిన కార్మి­కు­లకు, కాంగ్రెస్‌ వంటి పార్టీ­లకు ఇది నిస్సం­దే­హంగా విజ­యమే’ అని ఆయన పేర్కొ­న్నారు. అయితే.. ఈ కొన్నేళ్లు ఈ కంపె­నీలు అని­శ్చి­తికి గుర­వ­డా­నికి మోదీ ప్రభు­త్వా­నిదే పూర్తి బాధ్య­తని ఆయన స్పష్టం చేశారు.


తమి­ళ­నా­డు­లోని సేలం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవే­టీ­క­ర­ణను నిలి­పి­వే­యా­లని కేంద్ర నిర్ణయం తీసు­కున్న నేప­థ్యంలో జైరా­ర­మేశ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. సేలం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవే­టీ­క­ర­ణపై బిడ్డ­ర్లను షార్ట్‌ లిస్టు చేసి­న­ప్ప­టికీ.. వారు తదు­పరి ప్రొసీ­డిం­గ్స్‌కు ఇష్ట­ప­డ­లేదు. 2019లోనే దుర్గా­పూ­ర్‌­లోని అల్లా­యీస్‌ స్టీల్స్‌ ప్లాంట్‌ (ఏఎస్పీ)ని, 2022లో కర్ణా­ట­క­లోని భ్రదా­వ­తిలో ఉన్న విశ్వే­శ్వ­రయ్య ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవే­టీ­క­ర­ణల ప్రయ­త్నా­లను నిలి­పి­వే­శారు.


మరి విశాఖ ఉక్కు?


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సైతం అమ్మేయాలని కేంద్ర ప్రభుత్వం ఉత్సాహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అయితే.. మరోసారి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో కార్మికులు, ప్రజలు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. రోజుల తరబడి నిరసనలు సాగాయి. అయితే.. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని గతంలో వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సెయిల్‌ యూనిట్ల ప్రైవేటీకరణ నిలిచిపోయిన నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారంపైనా స్పష్టమైన ప్రకటన కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎదురు చూస్తున్నాయి.