Mancherial మూడేళ్ల నుంచి ఇదే తంతు పరిహారం ఇవ్వని ప్రభుత్వం కలెక్టరేట్ ఎదుట ముంపు బాధితుల నిరసన విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు కాలనీలోకి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మూలంగా తోళ్ల వాగు గుండా ఇళ్లలోకి వరద నీరు వస్తుందంటు బాధిత ప్రజలు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల […]
Mancherial
విధాత ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 10వార్డు కాలనీలోకి కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ మూలంగా తోళ్ల వాగు గుండా ఇళ్లలోకి వరద నీరు వస్తుందంటు బాధిత ప్రజలు జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుండి కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ వల్ల ఇళ్లలోకి వరద నీళ్లు వచ్చి సర్వస్వం కోల్పోతున్నామని తెలిపారు. మా కాలనీ లోకి వరద నీరు రాకుండా కరకట్ట నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ముంపు కాలనీల బాధితులకు నష్టపరిహారం చెల్లించి, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.