Weather Report | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరశాఖ తెలిపింది. దాంతో పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బుధవారం ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో పలుచోట్ల వానలు కురుస్తాయని చెప్పింది.
Weather Report | తెలంగాణలో రాగల నాలుగురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరశాఖ తెలిపింది. దాంతో పలు జిల్లాల్లో ఎల్లో అలెర్ట్ను జారీ చేసింది. బుధవారం ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలులతో పలుచోట్ల వానలు కురుస్తాయని చెప్పింది. 9న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
10న ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వానలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వివరించింది. అలాగే, శనివారం నుంచి సోమవారం వరకు పలు జిల్లాల్లో అక్కడక వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్లో అత్యధికంగా మియాపూర్లో 113.5 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, సిద్దిపేట, వరంగల్, నల్గొండ, ములుగు, సూర్యాపేట, జనగామతో పాటు పలు జిల్లాల్లో సాధారణం నుంచి భారీ వర్షాపాతం నమోదైంది.