Kodandaram విధాత: రాజకీయాలను పూర్తిగా కార్పోటీకరణ చేసి ప్రజలను నామమాత్రం చేసిన KCRను గద్దె దింపి తీరుతామని, తెలంగాణ జనసమితీ పార్టీనీ ఏ పార్టీలో విలీనం చేయబోమని ప్రజాస్వామిక తెలంగాణ కై నిలబడి కలబడుతామని జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఇటీవల సూర్యాపేటలో జరిగిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కోదండరాం అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానంతరం జరిగిన విలేఖరుల సమావేశలో ఆయన మాట్లాడారు. బీఆర్ ఎస్ ఏలుబడిలో మన […]
Kodandaram
విధాత: రాజకీయాలను పూర్తిగా కార్పోటీకరణ చేసి ప్రజలను నామమాత్రం చేసిన KCRను గద్దె దింపి తీరుతామని, తెలంగాణ జనసమితీ పార్టీనీ ఏ పార్టీలో విలీనం చేయబోమని ప్రజాస్వామిక తెలంగాణ కై నిలబడి కలబడుతామని జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. ఇటీవల సూర్యాపేటలో జరిగిన తెలంగాణ జన సమితి అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన కోదండరాం అధ్యక్షతన ఆదివారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశానంతరం జరిగిన విలేఖరుల సమావేశలో ఆయన మాట్లాడారు.
బీఆర్ ఎస్ ఏలుబడిలో మన రాష్ట్రంలో రాజకీయాలు పూర్తిగా కార్పొరేటీకరణ చెందాయి. ఈ రాజకీయాలలో పైసలను వెదజల్లి ప్రతిపక్షాలను చీల్చి, బలహీనం చేసి, ఓట్లను కొల్లగొట్టి, కోట్ల రూపాయలతో ఎంపిక చేసుకున్న రాజకీయ విశ్లేషకుల సలహాల ప్రకారం వాణిజ్య ప్రకటన తీరుగా ప్రచార వ్యూహాలను రూపొందించుకు పోతున్నారు. ప్రజలకు కార్పొరేట్ రాజకీయాల్లో స్థానం లేదు. వారు సినిమాలో ప్రేక్షకుల వలె జరిగినది చూస్తుంటారు. నిమిత్త మాత్రులుగా మిగిలి పోతారు.
కార్పొరేట్ రాజకీయాల్లో ప్రజలకు అర్థవంతమైన భాగస్వామ్యం వుండదు. ప్రజల నిజమైన ప్రతినిధులకు ప్రాతినిధ్యం కాని వారి సమస్యలకు గుర్తింపు ఉండదు. అందు వలన బడుగు, బలహీన వర్గాలకు మరియు జనసమితి లాంటి పార్టీలకు రాజకీయాల్లో ఆటంకాలు ఎదురవుతుంటాయి అన్నారు.
అందువలన రాజకీయాల్లో నిలదొక్కు కోవడానికి వ్యూహత్మకంగా వ్యవహరిస్తుందన్నారు. స్వంత కార్యాచరణ ఆధారంగా నిలదొక్కుకుంటూ కలిసిరాగల శక్తులతో కలిసి సాగుతాం అన్నారు. వీలైనన్ని రాజకీయ, రాజకీయేతర శక్తులను కలిపి బలాన్ని పెంచుకుంటాం. అయితే ఎట్టి పరిస్థితిలోనూ మా పార్టీని ఇతర పార్టీల్లో విలీనం చేయాలన్న ఆలోచన లేదు.
మా అస్తిత్వాన్ని కాపాడుకుంటూ అందరినీ ఐక్యం చేసే బాధ్యత తీసుకుంటామన్నారు. ప్రత్యామ్నాయ రాజకీయల కోసం కట్టుబడి వున్నాం కనుక ఆ రాజకీయాల సాధన కోసం కృషి చేయవలసిన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి అన్నీ శక్తులను ఐక్యం చేస్తామన్నారు. ఈ దృక్పథానికి లోబడి మా కార్యాచరణ వుంటుంది అన్నారు.
ఎన్నికల సందర్భంలో ఉన్నాం కనుక మా కార్యక్రమాలను వీలైనంతగా నియోజక వర్గాల కేంద్రముగా పని చేస్తామన్నారు. తెలంగాణ జాతి పిత జయశంకర్ వర్ధంతి రోజు నుండి జయశంకర్ స్వగ్రామం అక్కంపేట నుండి తెలంగాణ బచావో యాత్ర చేపట్టనున్నట్లు కోదండరా తెలిపారు.
ధరణి సమస్యల పైన మండలాల వారీగా సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వరిధాన్యం కోనుగోలులో మిల్లర్లు బస్తాకు ఏడు కిలోల వరకు కోత పెడుతున్నారు అవి స్ధానిక ఎమ్మెల్యేలు మిల్లర్లు కలిసి చేస్తున్న దోపిడి అని విమర్శించారు. ఎలాంటి కోతలు లేకుండా రైతులకు మొత్తం డబ్బులూ ఇవ్వాలని ఆందోళన చేస్తామన్నారు. అందరికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, అర్హులైన వారందరికీ రేషన్ కార్డుల కోసం పోరాడుతామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.యల్ విశ్వేశ్వర రావు, రాజమల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్షులు ధర్మార్జున్, గోపాగాని శంకర రావు, ముక్కెర రాజు, ఆశప్ప, నిర్జన రమేష్, పల్లె వినయ్, కార్యదర్శులు, రామనాథం, సత్యనారాయణ, రైతు సమితి రాష్ట్ర అధ్యక్షులు మోహన్ రెడ్డి, యువజన సమితి రాష్ట్ర అధ్యక్షులు సలీం పాషా, విద్యార్ధి జన సమితి రాష్ట్ర అధ్యక్షులు సర్దార్, పార్టీ రాష్ట్ర కమిటి సభ్యులు, జిల్లాల అధ్యక్ష ప్రథాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల రాష్ట్ర బాధ్యులు పాల్గొన్నారు.