విధాత, సినిమా: ఈ మధ్య జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ వైరల్ అవడమే కాకుండా.. ఆ తర్వాత వివాదంగానూ మారిన విషయం తెలిసిందే. ఈ వివాదం మొన్నటి వరకు నడుస్తూనే ఉంది. నాగబాబు, ఉత్తేజ్, చోటా కె నాయుడు ఇలా చిరంజీవిని అభిమానించే వారంతా.. అవధాని గారిపై సీరియస్ అవడంతో.. ఈ ఇష్యూ చాలా రకాలుగా తిరిగి వచ్చింది. చివరికి అవధాని గారు కూడా నేను […]
విధాత, సినిమా: ఈ మధ్య జరిగిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో చిరంజీవిని ఉద్దేశిస్తూ.. ప్రముఖ అవధాని గరికపాటి నరసింహారావు చేసిన కామెంట్స్ వైరల్ అవడమే కాకుండా.. ఆ తర్వాత వివాదంగానూ మారిన విషయం తెలిసిందే. ఈ వివాదం మొన్నటి వరకు నడుస్తూనే ఉంది.
నాగబాబు, ఉత్తేజ్, చోటా కె నాయుడు ఇలా చిరంజీవిని అభిమానించే వారంతా.. అవధాని గారిపై సీరియస్ అవడంతో.. ఈ ఇష్యూ చాలా రకాలుగా తిరిగి వచ్చింది. చివరికి అవధాని గారు కూడా నేను అలా అనకుండా ఉండాల్సిందనే అభిప్రాయాన్ని కలిగించింది.
వాస్తవానికి ఈ ఇష్యూ ఆరోజే ముగిసిపోయింది. అవధానిగారి వ్యాఖ్యల తర్వాత చిరంజీవి వెళ్లి సారీ చెప్పడం.. చిరంజీవిని పక్కనే కూర్చోబెట్టుకుని గరికపాటి వారు ప్రవచనాలు చెప్పడం.. అసలక్కడేం లేదు అనేది తలపించినా.. ఆ తర్వాత కొందరు రియాక్ట్ అయిన తీరుతో.. ఇదో పెద్ద వివాదంగా మారింది. దీంతో ఇండస్ట్రీలో కనిపించిన ప్రతి ఒక్కరినీ.. ఈ వివాదంపై స్పందించాలంటూ మీడియా కూడా వెంటబడింది.
అలాగే ఇప్పుడు మంచు విష్ణు వంతు వచ్చింది. మంచు విష్ణు హీరోగా చేసిన ‘జిన్నా’ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో.. ఆయన చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నారు. సినిమా ప్రమోషన్స్లో ఉన్న మంచు విష్ణుని.. ఈ వివాదంపై స్పందించాలంటూ ఓ విలేఖరి కోరగా.. ఆయన ఊహించని విధంగా స్పందించారు.
‘‘అసలు నాకు అక్కడ ఏం జరిగిందో కరెక్ట్గా తెలియదు. చిరంజీవి గారి అభిమానులపై గరికపాటి గారు ఏదో మాట్లాడారు.. అని విన్నాను కానీ.. పూర్తి సబ్జెక్ట్ నాకు తెలియదు. కానీ చిరంజీవిగారితో ఫొటో తీసుకోవడం అనేది వాళ్ల అభిమానులందరికీ బంగారం వంటి అవకాశం. చిరంజీవిగారు ఒక లెజెండ్. ఆయన కనబడితే ఎవరైనా సరే.. పరిగెత్తుకుంటూ వెళ్లి ఫొటో తీసుకుంటారు. ఇది సాధారణ విషయం. ఫ్యాన్స్ యాంగ్జయిటీని ఎవరూ ఆపలేరు..’’ అని మంచు విష్ణు సమాధానమిచ్చారు. దీంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.
ఎందుకంటే మెగా, మంచు ఫ్యామిలీలకు ఈ మధ్య అస్సలు పొసగడం లేదు. ఈ ప్రశ్నకు మంచు విష్ణు ఖచ్చితంగా అవధానిగారివైపు మాట్లాడతాడని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా చిరంజీవి లెజెండ్ అంటూ ఆయన వ్యాఖ్యలు చేయడంతో ఆశ్చర్యపోవడం అందరి వంతైంది.
అయితే ఇక్కడొక విషయం గమనించాలి. ఆయన హీరోగా చేసిన ‘జిన్నా’ సినిమా విడుదల కాబోతోంది. ఈ సినిమాకి నిర్మాతలు కూడా మంచు ఫ్యామిలీ వారే. ఈ సమయంలో ఎటువంటి కాంట్రవర్సీ వ్యాఖ్యలు చేసినా.. సినిమా రిజల్ట్పై తేడా పడుతుందని అనుకున్నాడో.. లేదంటే.. ఈ సమయంలో ట్రోలింగ్కి చిక్కడం ఎందుకని అనుకున్నాడో తెలియదు కానీ.. ఈ విషయంలో మాత్రం విష్ణు చాలా సమయస్ఫూర్తిగా వ్యవహరించాడని అంతా అనుకుంటున్నారు.