విధాత, హైదరాబాద్: ఐటీ కారిడార్తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఆక్సీజన్ హబ్గా, రోజు వారీ వాకింగ్తో పాటు వారాంతాల్లో కుటుంబాలకు సేద తీరే ప్రాంతంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. 270 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం, అటవీశాఖ చొరవతో ప్రకృతివనంగా మారిందన్నారు. ఇవాళ సమావేశం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ […]
విధాత, హైదరాబాద్: ఐటీ కారిడార్తో పాటు చుట్టు ప్రక్కల ప్రాంతాలకు ఆక్సీజన్ హబ్గా, రోజు వారీ వాకింగ్తో పాటు వారాంతాల్లో కుటుంబాలకు సేద తీరే ప్రాంతంగా కొత్తగూడ బొటానికల్ గార్డెన్స్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ విశేషంగా ప్రాధాన్యతను సంతరించుకుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు. 270 ఎకరాల్లో విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం, అటవీశాఖ చొరవతో ప్రకృతివనంగా మారిందన్నారు.
ఇవాళ సమావేశం సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అద్భుతంగా తీర్చిదిద్దిన బొటానికల్ గార్డెన్స్ విశిష్టతను కాపాడేందుకు తనవంతుగా ప్రయత్నం చేస్తానని ఎంపీ ఈ సందర్భంగా హామీఇచ్చారు.
వజ్రోత్సవ వేడుకల సదర్భంగా వాకర్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన రన్ ఫర్ పీస్ కార్యక్రమం పోస్టర్, టీషర్ట్స్ ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి ఎంపీ ఆవిష్కరించారు. ఊరు ఊరుకో జమ్మి చెట్టు – గుడిగుడికో జమ్మి కార్యక్రమంలో పాల్గొన్నవారు తమ ఫోటోలను జమ్మి అని టైప్ చేసి 9000365000 నంబర్కు వాట్స్ అప్ చేయాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వాహకులు తెలిపారు.
కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్, ఫారెస్ట్ కార్పోరేషన్ అధికారులు, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధులు రాఘవ, కరుణాకర్, బొటానికల్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు