విధాత: ఫైవ్ స్టార్ హోటల్లో తిని.. ఆ బిల్లును చిల్లర (COINS) పైసలతో చెల్లించాడో వ్యక్తి. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం చుట్టుపక్కలవారి వంతైంది. ముంబైలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకి వెళితే.. ప్రఖ్యాత తాజ్ మహల్ ప్యాలెస్ (TAJ HOTEL)కు సిద్ధేశ్ లకారే (SIDDHSH LAKARE) అనే వ్యక్తి టిప్పుటాపుగా తయారై వెళ్లాడు. అక్కడ రగ్దా పూరీ (RAGDA PURI) ఆర్డర్ ఇచ్చాడు. దీని విలువ రూ.800 (బయట వీధి దుకాణాల్లో రూ.50గానే ఉంటుంది). కొద్దిసేపటి […]
విధాత: ఫైవ్ స్టార్ హోటల్లో తిని.. ఆ బిల్లును చిల్లర (COINS) పైసలతో చెల్లించాడో వ్యక్తి. దీన్ని చూసి ఆశ్చర్యపోవడం చుట్టుపక్కలవారి వంతైంది. ముంబైలో జరిగిన ఈ ఆసక్తికర ఘటన వివరాల్లోకి వెళితే.. ప్రఖ్యాత తాజ్ మహల్ ప్యాలెస్ (TAJ HOTEL)కు సిద్ధేశ్ లకారే (SIDDHSH LAKARE) అనే వ్యక్తి టిప్పుటాపుగా తయారై వెళ్లాడు.
అక్కడ రగ్దా పూరీ (RAGDA PURI) ఆర్డర్ ఇచ్చాడు. దీని విలువ రూ.800 (బయట వీధి దుకాణాల్లో రూ.50గానే ఉంటుంది). కొద్దిసేపటి తర్వాత ఓ సాధారణ పిజ్జా (PIZZA), మాక్టెయిల్నూ ఆర్డర్ చేశాడు (వీటి ధరలు మాత్రం తెలియవు).
వీటన్నిటినీ ఆరగించాక వెయిటర్ను బిల్లు తెమ్మని సిద్ధేశ్ కోరాడు. ఇక వెయిటర్ వచ్చేలోపు తాను తెచ్చుకున్న కవర్లోని చిల్లరనంతా గుమ్మరించి లెక్కపెట్టడం మొదలుపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా విస్తుపోయారు. వెయిటర్కూ చాలా కొత్తగానే అనిపించింది.
ఇక నేషనల్ యూనియన్ చిల్లర్ పార్టీ అంటూ వెయిటర్ చేతిలో ఆ చిల్లరంతా సిద్ధేశ్ పెట్టేశాడు. అలాగే పిజ్జా, మాక్టెయిల్ బిల్లు కోసం కరెన్సీ నోట్లనూ ఇచ్చాడు. దీంతో ఈ చిల్లరను లెక్కపెట్టాలంటూ వెయిటర్ కిచెన్లోకి వెళ్లగా, అక్కడున్న సిబ్బంది అంతా కలిసి లెక్కించారు.
ఇంతకీ సిద్ధేశ్ లకారే ఓ కంటెంట్ ప్రోడ్యూసర్. గమ్మత్తైన ఎక్స్పరిమెంట్ కోసం ఇదంతా చేయగా, ఈ మొత్తం ఎపిసోడ్ను వీడియో కూడా తీశాడు. ఇప్పుడీ వీడియో ఇన్స్టాగ్రామ్ (INSTAGRAM)లో హల్చల్ చేస్తున్నది. వీలైతే మీరూ ఓ లుక్కేయండి.