Nalgonda విధాత: ఉద్యోగాల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ జూనియర్, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె శుక్రవారం 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్యదర్శులు కలెక్టరేట్ల ముందు బతుకమ్మలు ఆడుతూ నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల చెరువులలో, రిజర్వాయర్లలోకి దిగి నిరసనలు వ్యక్తం చేశారు. సమ్మె పరిష్కారం దిశగా ప్రభుత్వ నుండి చొరవ కరువైన నేపథ్యంలో సమ్మె ఉధృతం చేసేందుకే జెపిఎస్, ఒపిఎస్ లు నిర్ణయించుకున్నారు. సమ్మెతో గ్రామపంచాయతీలలో పాలన క్లిష్టమవుతుందని జిల్లాల్లో అధికారులు వాపోతున్నారు. గత […]
Nalgonda
విధాత: ఉద్యోగాల క్రమబద్ధీకరణను డిమాండ్ చేస్తూ జూనియర్, అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులు చేపట్టిన సమ్మె శుక్రవారం 15వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కార్యదర్శులు కలెక్టరేట్ల ముందు బతుకమ్మలు ఆడుతూ నిరసనలు తెలిపారు. కొన్నిచోట్ల చెరువులలో, రిజర్వాయర్లలోకి దిగి నిరసనలు వ్యక్తం చేశారు.
సమ్మె పరిష్కారం దిశగా ప్రభుత్వ నుండి చొరవ కరువైన నేపథ్యంలో సమ్మె ఉధృతం చేసేందుకే జెపిఎస్, ఒపిఎస్ లు నిర్ణయించుకున్నారు. సమ్మెతో గ్రామపంచాయతీలలో పాలన క్లిష్టమవుతుందని జిల్లాల్లో అధికారులు వాపోతున్నారు. గత మంగళవారం సాయంత్రం ఐదు గంటల్లోగా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ ప్రభుత్వము నుండి ఈ దిశగా ఎలాంటి నోటీసులు, టెర్మినేషన్ ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు.
ఒకవేళ ఉద్యోగాలను తొలగించే నోటీసులు, ఉత్తర్వులు విడుదలైన పక్షంలో వాటిపై న్యాయపోరాటానికి దిగాలని ఇప్పటికే జెపిఎస్ లు నిర్ణయించారు.
నల్గొండ జిల్లాలో 648 మంది జేపీఎస్ లు, 82 మంది ఓపిఎస్ లు మొత్తం 730 మంది సమ్మెలో కొనసాగుతున్నారు. గత మంగళవారం సాయంత్రం 110 మంది జేపీఎస్ లు, 25 మంది ఓపిఎస్ లు విధుల్లో చేరినప్పటికీ తిరిగి వారంతా మళ్లీ సమ్మెలో కొనసాగుతున్నారు. నల్గొండ తో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట జిల్లాలలో సైతం జేపీఎస్, ఒపిఎస్ లు సమ్మెలోనే కొనసాగుతూ నిరసనలను ఉదృతం చేశారు.
ఇది ఇలా ఉండగా వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం రంగాపురం జూనియర్ పంచాయతీ కార్యదర్శి సోనీ ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. మొన్నటిదాకా సమ్మె లో పాల్గొన్న సోనీ సమ్మె విరమించి నిన్ననే విధుల్లో చేరిందని.. ఇంతలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం వెనుక కారణాలు ఏమిటన్నది తెలియాల్సి ఉంది.