Land Auction అమ్మకానికి 300ఫ్లాట్లు విధాత: హైద్రాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల వేలం పరంపరలో మోకిల రెండో ఫేజ్ 300ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 98,975గజాలకు సంబంధించి 300ఫ్లాట్లను అమ్మకానికి ఈ నెల 23,24,25,28,29తేదిలలో ఈ వేలం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఈనెల 21వరకు 1,180రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఈ లే అవుట్లో 300 నుండి 500 గజాల లోపు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వేలంలో పాల్గొనే వారు లక్ష రూపాయలు […]
Land Auction
విధాత: హైద్రాబాద్ నగరంలో ప్రభుత్వ భూముల వేలం పరంపరలో మోకిల రెండో ఫేజ్ 300ఫ్లాట్ల అమ్మకానికి హెచ్ఎండీఏ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. 98,975గజాలకు సంబంధించి 300ఫ్లాట్లను అమ్మకానికి ఈ నెల 23,24,25,28,29తేదిలలో ఈ వేలం నిర్వహించనున్నారు.
ఇందుకు సంబంధించి ఈనెల 21వరకు 1,180రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సివుంటుంది. ఈ లే అవుట్లో 300 నుండి 500 గజాల లోపు ఫ్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వేలంలో పాల్గొనే వారు లక్ష రూపాయలు డిపాజిట్ చేయాలి. కనీస చదరపు ధర 25వేలుగా నిర్ణయించారు.
ఈ రెండో ఫేజ్ ప్లాట్ల వేలం ద్వారా 800కోట్ల ఆదాయం రావచ్చని హెచ్ఎండీఏ అంచనా వేస్తుంది. మోకిల తొలి విడత ఫ్లాట్ల వేంలలో గజానికి గరిష్టంగా 1.05లక్షలు, కనిష్టంగా 72వేలు పలికాయి.