Formula E Race | 18 నుంచి ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు మూసివేత
Formula E Race | హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ రేస్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుతో పాటు నెక్లెస్ రోడ్డు మూసివేయనున్నారు. పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ థియేటర్ల వైపు వచ్చే […]

Formula E Race | హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ తీరాన ఈ నెల 19, 20 తేదీల్లో ఫార్ములా ఈ రేస్ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 18 నుంచి 20వ తేదీ వరకు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కుతో పాటు నెక్లెస్ రోడ్డు మూసివేయనున్నారు.
పర్యాటకులు ఈ విషయాన్ని గమనించాలని అధికారులు సూచించారు. హుస్సేన్ సాగర్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్, ఐమాక్స్ థియేటర్ల వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు. పర్యాటకులు, వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ రేస్కు సంబంధించి టికెట్లను ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఈ ఈవెంట్కు రెగ్యులర్, వీకెండ్ పాస్ పేరిట టికెట్లను జారీ చేస్తున్నారు. రెగ్యులర్ పాస్ను రూ. 749కి విక్రయిస్తున్నారు. ఇది కేవలం 19వ తేదీకి మాత్రమే వర్తిస్తుంది.
వీకెండ్ పాస్ను రూ. 1,249కి విక్రయిస్తున్నారు. ఈ పాస్ రెండు రోజులకు వర్తిస్తుంది. లీగ్ను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు బుక్ మై షోలో టికెట్లు కొనుగోలు చేయవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. టికెట్ల బుకింగ్స్, ఇతర విషయాల కోసం https://in.bookmyshow.com/hyderabad/sports/indian-racing-league-weekend-pass/ET00343449 ఈ వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.