సొంతింటి నిర్మాణానికి పద్మావతి ఉత్తమ్ భూమి పూజ

విధాత: పీసీసీ మాజీ చీఫ్ నల్గొండ ఎంపీ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్‌లో నిర్మించ తలపెట్టిన సొంతింటి నిర్మాణ పనులకు బుధవారం పద్మావతి ఉత్తమ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అహర్నిశలు అందుబాటులో ఉండేందుకు, వారితో మమేకమయ్యేందుకు సొంత ఇంటి నిర్మాణ భావన అవసరమన్నారు. అందుకే నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. నియోజకవర్గ ప్రజలను సొంత బిడ్డలుగా భావించే తమకు ఇక్కడి […]

  • Publish Date - February 1, 2023 / 01:05 PM IST

విధాత: పీసీసీ మాజీ చీఫ్ నల్గొండ ఎంపీ నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్‌లో నిర్మించ తలపెట్టిన సొంతింటి నిర్మాణ పనులకు బుధవారం పద్మావతి ఉత్తమ్ భూమి పూజ చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు అహర్నిశలు అందుబాటులో ఉండేందుకు, వారితో మమేకమయ్యేందుకు సొంత ఇంటి నిర్మాణ భావన అవసరమన్నారు.

అందుకే నియోజకవర్గ కేంద్రాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టామన్నారు. నియోజకవర్గ ప్రజలను సొంత బిడ్డలుగా భావించే తమకు ఇక్కడి ప్రజలే కుటుంబం అన్నారు. వారి కోసం నిస్వార్ధంగా పనిచేయడమే తమ జీవితాశయమన్నారు.