కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన నొయిడాకు చెందిన విద్యార్థి శవమై తేలాడు. అతడిని తన నలుగురు స్నేహితులు హత్య చేసి, యూపీలోని అమ్రోహాలోని ఒక పొలంలో పాతిపెట్టినట్టు పోలీసులు కనుగొన్నారు
నొయిడా: కొద్ది రోజుల క్రితం అదృశ్యమైన నొయిడాకు చెందిన విద్యార్థి శవమై తేలాడు. అతడిని తన నలుగురు స్నేహితులు హత్య చేసి, యూపీలోని అమ్రోహాలోని ఒక పొలంలో పాతిపెట్టినట్టు పోలీసులు కనుగొన్నారు. ఈ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరొకరు పరారీలో ఉన్నట్టు తెలిపారు.
నొయిడాలోని ప్రైవేటు యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్న యశ్ మిట్టల్.. మంగళవారం నుంచి కనిపించకుండా పోయాడు. యశ్ను వదలిపెట్టాలంటే డబ్బులు ఇవ్వాలని గుర్తు తెలియని వ్యక్తులు ఆయన డ్రి దీపక్ మిట్టల్కు ఫోన్ చేశారు. నిందితులు ఆరు కోట్లు డిమాండ్ చేశారని నొయిడా పోలీసులు మీడియాకు తెలిపారు. యూనివర్సిటీ నుంచి ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లడం సీసీటీవీ విజువల్స్లో కనిపించిందని పోలీసులు చెప్పారు. పోలీసులు యశ్ కాల్ డిటెయిల్స్ను పరిశీలించగా.. అందులో అతడి స్నేహితుడు రచిత్ నంబర్ కూడా ఉన్నది. యశ్ తరచూ రచిత్, శివం, సుశాంత్, సుభం అనే స్నేహితులతో గడుపుతుంటాడని పోలీసులు చెప్పారు.
అమ్రోహాలో ఒక పార్టీకి యశ్ను సోమవారం పిలిచారు. ఈ పార్టీలో గొడవ జరిగి.. యశ్ హత్యకు గురయ్యాడు. నిందితులు అతడి శవాన్ని ఒక పొలంటో పూడ్చిపెట్టారు. ఆ ప్రాంతాన్ని రచిత్ గుర్తించిన తర్వాత పోలీసులు అక్కడ తవ్వి యశ్ శవాన్ని తీశారు. దాద్రిలో నిందితులను అరెస్టు చేశామని, శుభం అనే వ్యక్తి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబాన్ని పక్కదారి పట్టించేందుకే యశ్ తండ్రికి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేశారని పోలీసులు వెల్లడించారు.