ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణ ఈ నెల 25న జడ్చర్లలో కాంగ్రెస్ సభ 30 శాతం కమిషన్ సర్కారు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయం విధాత: కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ డోస్ పెంచింది. గెలుపై ధీమా వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను పెంచారు. కాస్త కష్టపడి పని చేస్తే అధికారం చేతికి వస్తుందని కాంగ్రెస్ నేతలు సొంతంగా చేయించుకున్న సర్వేలు చెపుతుండడంతో జాతీయ […]
విధాత: కర్ణాటక ఎన్నికల తరువాత తెలంగాణ (Telangana) కాంగ్రెస్ పార్టీ డోస్ పెంచింది. గెలుపై ధీమా వ్యక్తం కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ కార్యకలాపాలను పెంచారు. కాస్త కష్టపడి పని చేస్తే అధికారం చేతికి వస్తుందని కాంగ్రెస్ నేతలు సొంతంగా చేయించుకున్న సర్వేలు చెపుతుండడంతో జాతీయ పార్టీ కూడా తెలంగాణపై కేంద్రీకరించింది.
ఇప్పటి నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు విశ్రాంతి లేకుండా పని చేయాలని కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే జాతీయ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇన్చార్జ్గా మాణిక్ రావు ఠాక్రే హైదరాబాద్లోనే ఎక్కువ కేంద్రీకరించి పని చేస్తున్నారు. క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లి ఆయా నియోజకవర్గాలలో పార్టీ పరిస్థితి ఏమిటో తెలుసుకొని తగిన సూచనలు చేస్తున్నారు.
‘‘దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్…తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్’ అన్న నినాదాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించినట్ల తెలిసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 ఏళ్లు అయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలంగాణ అవతరణ ఉత్సవాలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. గ్రామ, మండల, జిల్లా స్థాయిలలో ఈ ఉత్సవాలు నిర్వహించ నున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తున్నది.
రాష్ట్రంలో పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడిందని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ 30శాతం కమిషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కర్ణాటకలో 40శాతం కమిషన్ సర్కారును కూల్చాం.. ఇక్కడ 30 శాతం కమిషన్ సర్కారును ఇంటికి పంపిద్దామనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని పార్టీ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై జాతీయ కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది.
నిత్యం ఈ రాష్ట్రంలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాలను మానిటరింగ్ చేయాలని నిర్ణయించినట్ల తెలిసింది. నాయకులు నిత్యం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలని ఇప్పటికే నాయకులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఇప్పటికే రాష్ట్రంపై కేంద్రీకరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు దాదాపు 20కిపైగా సభలలో పాల్గొనాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకులకు సమాచారం అందించినట్లు తెలిసింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పాదయాత్ర మొదలు పెడితే.. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క కొనసాగిస్తున్నారు. ఈ పాదయాత్రలో భాగంగా ఈ నెల25వ తేదీన జడ్చర్ల కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఈ సభకు హిమాచల్ ప్రదేశ్ సీఎం సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు ముఖ్య అతిధిగా హాజరవుతున్నారు. భట్టి పాదయాత్ర బహిరంగ సభకి హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్వింధర్ సింగ్ సుక్కు వస్తున్నారు.