Rakul Preet Singh | హైదరాబాద్‌లో మళ్లీ రకుల్ ప్రీత్‌సింగ్ సందడి

ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో చాన్నాళ్లకు మళ్లీ ప్రత్యక్షమైంది. తెలుగు ప్రేక్షకులకు దూరమై హిందీ, తమిళ్ సినిమాల్లో దర్శనమిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ ఈ దఫా హైదరాబాద్ పునరాగమనంలో సరికొత్త రెస్టారెంట్ బిజెనెస్‌తో అడుగు పెట్టింది

  • Publish Date - April 17, 2024 / 03:16 PM IST

ఆరంభం పేరుతో రెస్టారెంట్ బిజినెస్‌కు శ్రీకారం

విధాత: ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో చాన్నాళ్లకు మళ్లీ ప్రత్యక్షమైంది. తెలుగు ప్రేక్షకులకు దూరమై హిందీ, తమిళ్ సినిమాల్లో దర్శనమిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్ ఈ దఫా హైదరాబాద్ పునరాగమనంలో సరికొత్త రెస్టారెంట్ బిజెనెస్‌తో అడుగు పెట్టింది. హైదరాబాద్‌లో ‘ఆరంభం’ పేరుతో ఓవ్ వెజ్ రెస్టారెంట్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి.

ఫుడ్ ఇండస్ట్రీ వ్యాపారం లోకి ఎంటర్ ఇచ్చిన రకుల్‌ ఆరంభం రెస్టారెంట్‌లలో కేవలం మిల్లెట్స్ తో చేసిన వంటకాలు మాత్రం లభించబోతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే రకుల్ ప్రీత్‌సింగ్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టి హైదరాబాద్, వైజాగ్ మహానగరాలలో ఎఫ్‌-45 పేరుతో జిమ్‌లను నిర్వహిస్తుంది. ఈ జిమ్‌లకు సంపన్నులు, సెలబ్రిటీలు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ బిజినెస్ మాత్రమే కాకుండా వెల్ బీయింగ్ న్యూటీషియన్, వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్ కు సంబంధించిన వ్యాపారాల్లో కూడా రకుల్ భాగస్వామిగా ఉన్నారు.

తాజాగా రెస్టారెంట్ వ్యాపారం మొదలుపెట్టారు. ఈ మధ్యకాలంలోనే రకుల్ ప్రీత్ సింగ్ తన వైవాహిక జీతంలోకి అడుగు పెట్టింది. నిర్మాత, నటుడు జాకీభగ్నానీని ఆమె గోవాలో ప్రత్యేకంగా సాగిన పెళ్లివేడుకలో వివాహం చేసుకుంది. వివాహానంతరం రకుల్ ప్రీత్‌సింగ్ రెస్టారెంట్ బిజెన్‌లో అడుగుపెట్టడం విశేషం.

గతంలో హైదరాబాద్‌లో వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కోని..అప్పటి అధికార పార్టీ యువనేతతో సన్నిహితంగా మెలగారన్న గాసిప్స్ అనంతరం రాష్ట్రానికి దూరమైన రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా ఇన్నాళ్లకు రెస్టారెంట్ బిజినెస్‌తో తిరిగి రాష్ట్రంలో కాలుమోపడం చర్చనీయాంశమైంది.

Latest News