విధాత: భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ధనిక దేశంగా నిలిచినప్పటికీ. ఇక్కడి ప్రజలు పేదరికం, ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణంతో బాధ పడుతున్నారని గడ్కరీ అన్నారు. ధనిక, పేదల మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. నాగ్పూర్లో గురువారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు అనుబంధంగా ఉన్న సంస్థ భారత్ వికాస్ […]
విధాత: భారతదేశంలో రోజురోజుకూ పెరుగుతున్న పేదరికంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించి, ధనిక దేశంగా నిలిచినప్పటికీ. ఇక్కడి ప్రజలు పేదరికం, ఆకలి, నిరుద్యోగం, కులతత్వం, అంటరానితనం, ద్రవ్యోల్బణంతో బాధ పడుతున్నారని గడ్కరీ అన్నారు. ధనిక, పేదల మధ్య రోజురోజుకు పెరుగుతున్న ఈ అంతరాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు.
నాగ్పూర్లో గురువారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్కు అనుబంధంగా ఉన్న సంస్థ భారత్ వికాస్ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో దేశంలో ధనిక, పేదల మధ్య అంతరం పెరుగుతోందని దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు.
“ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనదే. పేద జనాభా ఉన్న ధనిక దేశం. మన దేశం సంపన్న దేశమే.. కానీ ప్రజలే ఆకలి, నిరుద్యోగం, పేదరికం, ద్రవ్యోల్బణం, కులతత్వం, అంటరానితనం వంటి అనేక సమస్యలతో బాధ పడుతున్నారు. ఇది సమాజ పురోగమనానికి మంచిది కాదు” అని అన్నారు.
అయితే.. దేశంలోని ఈ 124 జిల్లాలు సామాజిక, విద్య, ఆరోగ్య రంగాల్లో వెనుకబడి ఉన్నాయన్నారు. దేశంలోని పట్టణ ప్రాంతాల్లో చాలా అభివృద్ధి జరిగింది, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సౌకర్యాలు, అవకాశాల కొరత కారణంగా అధిక జనాభా నగరాలకు వలస వెళుతోంది. గ్రామీణ ప్రాంతాల సాధికారత కోసం భారత్ వికాస్ పరిషత్ కృషి చేయాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.