డాక్టర్ ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా: మంత్రి ఎర్రబెల్లి
అన్నివిధాల కుటుంబాన్ని ఆదుకుంటాం దోషులు ఎంతటి వారైనా, కఠినంగా శిక్షిస్తాం ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం ఆవేదన, విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ప్రీతి మరణంపై సీఎం తీవ్ర ఆవేదన, […]

- అన్నివిధాల కుటుంబాన్ని ఆదుకుంటాం
- దోషులు ఎంతటి వారైనా, కఠినంగా శిక్షిస్తాం
- ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరం
- ఆవేదన, విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
- రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: సీఎం కెసిఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పరంగా బాధిత ప్రీతి కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియాను ప్రకటించారు. ప్రభుత్వ పరంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు.
ప్రీతి మరణంపై సీఎం తీవ్ర ఆవేదన, విచారం వ్యక్తం చేశారని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ప్రకటన చేస్తున్నానని మంత్రి తెలిపారు.
అలాగే ప్రీతి ఘటనపై విచారణ కొనసాగుతున్నది. ఇప్పటికే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో తేలిన దోషులు ఎంతటి వారైనా సరే చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని మంత్రి తెలిపారు.
ప్రీతి ఘటన అత్యంత దురదృష్టం, బాధాకరమని, ఎవరూ పూడ్చలేని దుఖంలో ఆ కుటుంబం ఉందని, ప్రీతి ఆత్మ శాంతించాలని ఆ దేవుడిని మంత్రి ఎర్రబెల్లి ప్రార్థించారు. ఆమె కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.