Congress | ఆదివాసీ కాంగ్రెస్ ధర్నా.. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
Congress | విధాత: ఎల్బీన్గర్లో గిరిజన మహిళపై పోలీసుల థర్డ్డిగ్రీ ప్రయోగాన్ని నిరసిస్తు ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ భరత్ చౌహన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15 రోజునే అతికిరాతకంగా గిరిజన మహిళ అయినా లక్ష్మీబాయిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టి, రాత్రి మూడు గంటలు పోలీసు జీపులోనే […]

Congress |
విధాత: ఎల్బీన్గర్లో గిరిజన మహిళపై పోలీసుల థర్డ్డిగ్రీ ప్రయోగాన్ని నిరసిస్తు ఆదివాసీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శనివారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర వైస్ చైర్మన్ భరత్ చౌహన్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15 రోజునే అతికిరాతకంగా గిరిజన మహిళ అయినా లక్ష్మీబాయిని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెట్టి, రాత్రి మూడు గంటలు పోలీసు జీపులోనే ఉంచడం దారుణమన్నారు.
బాధిత మహిళ లక్ష్మి యొక్క బాధ వర్ణనాతీతమని, పోలీసుల జులుంకు, కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బాధిత మహిళకు న్యాయం చేయాలని, బాధిత మహిళ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు డబుల్ బెడ్ రూమ్, 25 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
అతి కిరాతకంగా చట్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన పోలీస్ అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు అటెంప్ట్ మర్డర్, నిర్భయ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ జిల్లా ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ ధనరాజు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాథోడ్, ఖైరతాబాద్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బల్లు, చవాన్ లక్ష్మి బాయి, రమేష్ తదితరులు పాల్గొన్నారు.