Trivikram brought in a senior actress విధాత: ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB28 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరికీ హ్యాట్రిక్ చిత్రం. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. […]
Trivikram brought in a senior actress
విధాత: ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో SSMB28 వర్కింగ్ టైటిల్తో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇది వీరిద్దరికీ హ్యాట్రిక్ చిత్రం. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక షెడ్యూల్ షూటింగ్ జరుగుతుంది. మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీల, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్ వంటి వారు ఈ షెడ్యూల్లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ శరవేగంగా పూర్తి చేయాలని దర్శకుడు త్రివిక్రమ్ భావిస్తున్నాడట. అయితే ఈ ఒక్క షెడ్యూల్ షూటింగ్కి రూ.10 కోట్లు ఖర్చు అవుతుందట. ఈ షెడ్యూల్లో కొన్ని లవ్ సీన్స్తో పాటు యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరించనున్నారట. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో భారీ తారాగణం నటించబోతున్నట్లుగా సమాచారం. అలాగే త్రివిక్రమ్ సెంటిమెంట్ ప్రకారం ఓ సీనియర్ నటి ఈ చిత్రంలో ఉంటుందని, ఆ నటి మరెవరో కాదు.. బాలీవుడ్ నటి రేఖ అని తెలుస్తుంది. నిన్నటి హీరోయిన్ రేఖని త్రివిక్రమ్ ఓ ముఖ్య పాత్రకు ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ విషయంపై ఆమెతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. ఆమె కథ విని.. ఈ ప్రాజెక్ట్లో నటించడానికి సైన్ చేసిన అనంతరం.. నిర్మాతలు అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించనున్నారట.
త్రివిక్రమ్ తన గత సినిమాలలో కూడా బాలీవుడ్ స్టార్స్ని ఎంపిక చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. బొమన్ ఇరానీ, టబు, సోనూసూద్ వంటి బాలీవుడ్ నటులు త్రివిక్రమ్ సినిమాల్లో నటించారు. ఇప్పుడు రేఖ.. మొత్తంగా చూస్తే.. బాలీవుడ్ నటులు ఇప్పుడు టాలీవుడ్లో భాగమై పోతున్నారు. అలా చేయడం వల్ల సినిమాకి పాన్ ఇండియా ఇమేజ్ కల్పించే ప్రయత్నం చేస్తున్నారనేలా కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు త్రివిక్రమ్ అంటే.. సీనియర్ నటి ఉండాల్సిందే అంటున్నారు. కాకపోతే ఈ సినిమాలో ఇద్దరు ముగ్గురు సీనియర్ నటీమణులు నటిస్తున్నారనే తాజా సమాచారం.