Union Cabinet Expansion | నేడు కేంద్ర కేబినెట్‌ కీలక సమావేశం..! మంత్రి మండలి విస్తరణపై చర్చించే ఛాన్స్‌..!

Union Cabinet Expansion | ఈ ఏడాది పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సైతం సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రి మండలి సమావేశం జరుగబోతున్నది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నది ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో అందరి దృష్టి […]

Union Cabinet Expansion | నేడు కేంద్ర కేబినెట్‌ కీలక సమావేశం..! మంత్రి మండలి విస్తరణపై చర్చించే ఛాన్స్‌..!

Union Cabinet Expansion |

ఈ ఏడాది పలు కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దాంతో పాటు లోక్‌సభ ఎన్నికలకు సైతం సమయం దగ్గరపడుతున్నది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో ఉన్న కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్రమంత్రి మండలి సమావేశం జరుగబోతున్నది. అయితే, ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నట్లుగా తెలుస్తున్నది. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నది ప్రచారం జరుగుతున్నది. ఈ క్రమంలో అందరి దృష్టి కేబినెట్‌ సమావేశాలపైనే ఉన్నది.

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభంకానున్నాయి. సమావేశాల్లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలనే అంశంపై భేటీలో చర్చించనున్నారు. మరో వైపు మంత్రిమండలిలో మార్పులు చేయాలని భావిస్తే వర్షాకాల సమావేశాలకు ముందే దాన్ని అమలు చేయాలనే వాదనలున్నాయి. జూన్‌ చివరివారంలో ప్రధాని నరేంద్ర మోదీ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో విడివిడిగా సమావేశమయ్యారు. అప్పటి నుంచి కేబినెట్‌ విస్తరణపై వార్తలు గుప్పుమంటున్నాయి.

ఈ ఏడాది తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌, మిజోరాం, త్రిపుర, రాజస్థాన్‌, మేఘాలయ, నాగాలాండ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో ఆయా రాష్ట్రాలకు కేబినెట్‌లో పెద్దపీట వేయాలని బీజేపీ అగ్రనాయకత్వం సైతం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమిపాలైంది.

ఎప్పుడూ అవినీతిని సహించేది లేదన్నది ప్రధాని నరేంద్ర మోదీ.. బీజేపీ పెద్దల మాట. కానీ, కర్నాటకలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినా ఎలాంటి చర్యలు చేపట్టేదు. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ప్రభుత్వం కర్నాటకలో మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి.

స్థానిక ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న ఆగ్రహం ఎన్నికల్లో ఓటమితో బయటపడింది. గతంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా జయకేతనం ఎగుర వేసిన బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రమైన కర్నాటక కాంగ్రెస్‌ చేతుల్లోకి వెళ్లిపోయింది. ఈ ఫలితం బీజేపీ అగ్రనాయకత్వాన్ని షాక్‌కు గురి చేస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమిస్తున్నది. ఇందులో భాగంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రమంత్రి మండలిలో ఆయా రాష్ట్రాలకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. నేటి కేబినెట్‌ సమావేశంలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకుంటో వేచి చూడాల్సిందే..!