Warangal భూమి కేటాయించేందుకు సిద్ధం వ్యాగన్ ఫ్యాక్టరీ స్థల పరిశీలన పాల్గొన్న బోయినపల్లి, దాస్యం, బండా విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న రైల్వే వ్యాగన్ […]
Warangal
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణ ప్రజల హక్కు అని, ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
కాజీపేట సమీపంలోని అయోధ్యపురంలో ఏర్పాటు చేయనున్న రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ స్థలాన్ని బుధవారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , శాసన మండలి డిప్యుటీ చైర్మన్ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి, ఎంపీ పసునూరి దయాకర్, బిఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ తదితరులు పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలనీ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పొందుపర్చిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సీటి, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తెలంగాణ ప్రజల హక్కుగా అడుగుతున్నామని స్పష్టం చేశారు. ఈ మూడు ప్రధాన హామీలు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినవిగా గుర్తించాలన్నారు. వీటి ఏర్పాటు వల్ల జిల్లాలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఈ ప్రాంతా అభివృద్ధికి దోహదం చేస్తుందన్నారు.
కోచ్ ఏర్పాటుకు అవసరమైన భూమిని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కనుక వెంటనే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనీ ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. రాజకీయ అవసరాలు ఎన్నికల కోసం ప్రధాని మోడీ వరంగల్ లో ప్రకటించారని ఇప్పటికైనా నాలుగు దశాబ్దాల ఈ ప్రాంత ప్రజల కల అయిన కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దీని వల్ల పెద్ద సంఖ్యలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, స్థానిక కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.