యాదాద్రి దేవస్థానం పేరును మళ్లీ గతంలో మాదిరిగా యాదగిరిగుట్టగా మార్చనున్నట్లుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు
విధాత : యాదాద్రి దేవస్థానం పేరును మళ్లీ గతంలో మాదిరిగా యాదగిరిగుట్టగా మార్చనున్నట్లుగా ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి ప్రధానాలయంలో టెంకాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే యాదాద్రి లక్ష్మినరసింహస్వామి దర్శనానికి సీఎం రేవంత్రెడ్డి వస్తారని వెల్లడించారు.
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరి గుట్టపై ప్రత్యేక దృష్టి సారించనున్నారని తెలిపారు. ప్రాచీన కాలం నుంచి యాదగిరిగుట్ట పేరుతో ఉన్న ఈ దేవస్థానం పేరును గత ప్రభుత్వం మార్చివేయడం సరికాదన్నారు. అందుకే తిరిగి యాదగిరిగుట్టగా ఈ దేవస్థానానికి నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుందని అయిలయ్య వెల్లడించారు.