మన సమాజం ఎంత ముందకు పోతున్నప్పటికీ వెనక్కి గుంజే కొన్ని సంఘటనలు మనని అయోమయంలో పడవేస్తుంటాయి. అటువంటిదే ఒక ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
రాయపూర్ : మన సమాజం ఎంత ముందకు పోతున్నప్పటికీ వెనక్కి గుంజే కొన్ని సంఘటనలు మనని అయోమయంలో పడవేస్తుంటాయి. అటువంటిదే ఒక ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది.
ఛత్తీస్గఢ్కు చెందిన రాజేశ్వర్ అనే వ్యక్తి ఉదయం 8 గంటల ప్రాంతంలో భక్తి పరవశుడై శ్రద్ధాసక్తులతో మంత్రోచ్ఛారణ జరిపి.. ఆ తరువాత తన నాలుకను కోసి శివునికి అర్పించాడు. ఛత్తీస్గఢ్ దుర్గ్ జిల్లాలోని అంజోరా పోలీస్ చౌకీ పరిథి లోని థనౌద్లో ఈ ఘటన చోటుచేసుకొంది. గ్రామంలోని రాజేశ్వర్ నిషాద్ (37) బుధవారం ఉదయం గ్రామంలోని చెరువు వద్దకు చేరి మంత్రాలు పఠించి, ఆ తరువాత ఆయన తన నాలుకను కోసి బండపై పెట్టి శివునికి అర్పించాడు. ఇది జరిగిన కొద్ది సేపటికే రాజేశ్వర్ సృహ తప్పి పడిపోయాడు. అక్కడే వున్న గ్రామస్తులు కొందరు ఇది చూసి ఆయనను హాస్పటల్లో చేర్పించారు. పోలీసులకు సమాచారం అందించారు.
రాజేశ్వర్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడడానికి కారణాలు ఏమిటనేది స్పష్టంగా వెలుగులోకి రాలేదు. రెండు ముఖ్య విషయాలు మాత్రం సూచన ప్రాయంగా తెలియవస్తున్నాయి. రాజేశ్వర్ శివభక్తుడు. ఆ రోజు మంత్రాలు చదివే నాలుక కోసుకొన్నాడు. కానీ ఆ దరిదాపుల్లో ఏ ఆలయం లేదు. ఆ పక్కనే వున్న బండరాయిపై పెట్టాడు. ఇదంతా చెరువులో జరిగింది. దానితో భక్తితోనే ఇలా చేశాడనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో విషయం రాజేశ్వర్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చాడు. రెండవ పెళ్ళిచేసుకొన్నాడు. ఆయనకొక కూతురు. రెండవ భార్య మూగ. రాజేశ్వర్ ఆమె పట్ల అమిత ప్రేమతో వున్నాడు. ఈ ప్రేమతోనే ఆయన ఆమెతో సమానంగా వుండాలని తన నాలుక కోసుకొన్నాడని అంటున్నారు.