ఢిల్లీ ఉద్యోగుల‌కు 7 వేల బోన‌స్‌.. సీఎం కేజ్రీవాల్ ప్ర‌క‌ట‌న‌

  • Publish Date - November 6, 2023 / 07:24 AM IST

  • దీపావ‌ళి కానుక‌గా రూ.56 వేల కోట్లు విడుద‌ల‌



విధాత‌: అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం దీపావళి పండుగకు గ్రూప్ బీ, సీ నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు రూ.7,000 ఫెస్టివల్ బోనస్‌ను సోమవారం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వంలోని ఉద్యోగులకు ఈ బోనస్‌ అందించేందుకు మొత్తం రూ.56,000 కోట్లు వెచ్చించనున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్ల‌డించారు.


“ఢిల్లీ ప్రభుత్వంలోని గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్, గ్రూప్ సీ ఉద్యోగులకు మేము రూ. 7,000 బోనస్‌గా అందిస్తాం. ప్రస్తుతం దాదాపు 80,000 మంది గ్రూప్ బీ, నాన్ గెజిటెడ్, గ్రూప్ సీ ఉద్యోగులు ఢిల్లీ ప్రభుత్వంలో పనిచేస్తున్నారు. వీరంద‌రికీ ఈ బోనస్ అందించడానికి 56 కోట్లు వెచ్చించనున్నాం” అని సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

Latest News