భార్య పశువు కాదు : సుప్రీంకోర్టు ఫైర్

భార్యను పశువులా చూడొద్దని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గృహహింస కేసులో భార్యపై దాడి చేసిన నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ మహిళలకు గౌరవప్రద జీవనం హక్కు అని స్పష్టం చేసింది.

భార్యను పశువులా చూడొద్దని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. గృహహింస కేసులో నిందితుడికి సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా భార్యను పశువులా చూడొద్దని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆమెకు గౌరవంగా జీవించే హక్కు ఉందని పేర్కొంది.

ఈ కేసులో నిందితుడు మద్యం మత్తులో భార్యపై దాడి చేశాడు. నేలపైకి తోయడంతో ఇటుక తగిలి ఆమె తలకు గాయమైంది. ఆ తర్వాత కూడా ఆమెపై కర్రతో కూడా దాడి చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో నిందితుడు ఏకంగా మూడు వివాహాలు చేసుకోవడం గమనార్మం. నిందితుడు మొదటి భార్య అతడిపై గృహ హింస, తనకు విడాకులు ఇవ్వకుండా మరో రెండు పెళ్లిళ్లు చేసుకోవడంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఇవి కూడా చదవండి :

అవి సలహాలు కాదు.. ప్రధాని పాలనా వైఫల్యానికి నిదర్శనాలు: రాహుల్ గాంధీ
మాజీ సీఎం స్టాలిన్ తో సీఎం విజయ్ భేటీ

Latest News