రఘురామరాజుపై కాలిపై గుర్తులకు ఎడీమా కారణం

తన కొట్టారంటూ రఘురామరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్‌ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. రఘురామరాజు కాలిపై కనిపిస్తున్న మచ్చలు లేక గుర్తులకు కారణంగా ఎడీమా అని తేలచ్చారు. రఘురామరాజు రెండుకాళ్లకి ఎడీమా ఉంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లేదా నిలబడ్డం వల్ల రెండు కాళ్లపాదాల రంగు మారి ఉండొచ్చు. రఘురామరాజు శరీరంపైన ఎలాంటి గాయాలూ లేవు. ఆయన పాదాల రంగు మారడానికి కారణం ఎవరో కొట్టడం వల్లకాదు. ఎడీమా అంటే: మెడికేషన్‌ […]

  • Publish Date - May 17, 2021 / 03:56 AM IST

తన కొట్టారంటూ రఘురామరాజు చూపించిన అరికాలు గాయాలు.. గాయాలు కావని జీజీహెచ్‌ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంచేశారు. రఘురామరాజు కాలిపై కనిపిస్తున్న మచ్చలు లేక గుర్తులకు కారణంగా ఎడీమా అని తేలచ్చారు.

  1. రఘురామరాజు రెండుకాళ్లకి ఎడీమా ఉంది.
  2. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల లేదా నిలబడ్డం వల్ల రెండు కాళ్లపాదాల రంగు మారి ఉండొచ్చు.
  3. రఘురామరాజు శరీరంపైన ఎలాంటి గాయాలూ లేవు. ఆయన పాదాల రంగు మారడానికి కారణం ఎవరో కొట్టడం వల్లకాదు.

ఎడీమా అంటే: మెడికేషన్‌ వల్ల లేదా గర్భందాల్చడం లేదా ఇన్‌ఫెక్షన్లు వల్ల ఎడీమా వస్తుంది. రక్తనాళాలనుంచి ద్రవాలు స్రవించి, ఈ ద్రవాలు పక్కనే ఉన్న కణజాలమీదకు పేరుకుంటాయి. దీనివల్లే కాళ్లు వాచినట్టుగా, కమిలినట్టుగా కనిపిస్తాయి. ఇదే అంశాన్ని జీజీహెచ్‌ వైద్యులు హైకోర్టుకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్టుగా తెలుస్తోంది.