Tirumala: మెట్ల మార్గంలో.. మొకాళ్ల‌పై వ‌చ్చి శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్న క్రికెట‌ర్‌

  • By: sr    news    Jan 14, 2025 1:35 PM IST
Tirumala: మెట్ల మార్గంలో.. మొకాళ్ల‌పై వ‌చ్చి శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకున్న క్రికెట‌ర్‌

మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్‌, తెలుగు కుర్రాడు నితిష్ కుమార్ రెడ్డి మ‌రోమారు జాత‌తీయ స్థాయిలో ట్రెండింగ్ అవుతున్నాడు. అందుకు కార‌ణం అత‌నికి ఉన్న విప‌రీత‌మైన‌ దైవ భ‌క్తే. ఏపీకి చెందిన నితీశ్‌కు తిరుమ‌ల వేంక‌టేశ్వ‌రుడిని అమితంగా ఆరాధిస్తాడు.

2

ఇటీవ‌ల అస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో క్లిష్ట ప‌రిస్థితుల్లో సెంచ‌రీ సాధించి దేశం ప‌రువు నిల‌బెట్టాడు. అంతేగాక ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చి శ‌త‌కంతో త‌న పేర క్రికెట్‌ చ‌రిత్ర‌లో స‌రికొత్త పేరు లిఖించుకున్నాడు. ఈనేప‌థ్యంలో ఇటీవ‌లే దేశానికి వ‌చ్చిన నితీశ్ కుటుంబంతో క‌లిసి మంగ‌ళ‌వారం తిరుమ‌ల ద‌ర్శ‌నం చేసుకున్నాడు.

1

ఈక్ర‌మంలో అంద‌రిలీ వీఐపీలా వెళ్ల‌కుండా ఆయ‌న తిరుమ‌ల మెట్ల మార్గంలో మోకాళ్ల‌పై న‌డుచుకుంటూ పైకి వెళ్లి మ‌రీ దైవ ద‌ర్శ‌నం చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవ‌డ‌మే కాక నితిశ్‌కు ఉన్న దైవ భ‌క్తిపై స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు ల‌భిస్తున్నాయి.

3