విధాత: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అయినా వైసీపి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరం, కదిరి పట్టణాల్లో ఆక్సిజన్ అందక రోగుల చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 24 గంటల్లో కదిరి ప్రభుత్వాస్పత్రిలో 8 మంది మృత్యువాత పడటం బాధాకరమన్నారు. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా […]
విధాత: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మృత్యు ఘంటికలు మోగిస్తోంది. అయినా వైసీపి ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. అనంతపురం, కర్నూలు, హిందూపురం, విజయనగరం, కదిరి పట్టణాల్లో ఆక్సిజన్ అందక రోగుల చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 24 గంటల్లో కదిరి ప్రభుత్వాస్పత్రిలో 8 మంది మృత్యువాత పడటం బాధాకరమన్నారు.
వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలన్నారు. అలాగే కొవిడ్ ఆసుపత్రుల్లో ఆహారం సరఫరా చేసే కాంట్రాక్టర్లకు బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.