విధాత:న్యాయవాదులు, వారి గుమస్తాలను ఏపి నుండి తెలంగాణ రాష్ట్రం లోనికి అనుమంతించపోవడంపై వేసిన రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ. ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు వెళ్లకుండా ఏపీ న్యాయవాదులను బార్డర్ లో తెలంగాణా పోలీసులు అడ్డుకుంటున్నారని హై కోర్టుకు తెలిపిన ఏపి న్యాయవాదులు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి. ఈ పాస్ లు చూపించాలన్న ప్రభుత్వం న్యాయవాది. డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు వాదనలను అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు హై కోర్టు.న్యాయవాదులు, గుమస్తాలపై […]
విధాత:న్యాయవాదులు, వారి గుమస్తాలను ఏపి నుండి తెలంగాణ రాష్ట్రం లోనికి అనుమంతించపోవడంపై వేసిన రిట్ పిటీషన్ పై తెలంగాణ హైకోర్టు విచారణ.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కు వెళ్లకుండా ఏపీ న్యాయవాదులను బార్డర్ లో తెలంగాణా పోలీసులు అడ్డుకుంటున్నారని హై కోర్టుకు తెలిపిన ఏపి న్యాయవాదులు డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి.
ఈ పాస్ లు చూపించాలన్న ప్రభుత్వం న్యాయవాది.
డిఎస్ఎన్వి ప్రసాద్ బాబు వాదనలను అంగీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు హై కోర్టు.న్యాయవాదులు, గుమస్తాలపై తెలంగాణా హై కోవిడ్ ఆంక్షలు సడలింపులు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు.న్యాయవాదులు బార్ కౌన్సిల్ , బార్ కౌన్సిల్ వద్ద నమోదు చేసుకున్న బార్ అసోషియేషన్ ఇచ్చిన గుర్తింపు కార్డు చూపించాలి.
న్యాయవాదుల వద్ద పనిచేసే గుమస్తాలు ఫోటో వున్న గుర్తింపు కార్డు లు చూపించాలి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన కోవిడ్ ఆంక్షలు పాటించాలి.ఈ ఉత్తర్వులను దుర్వినియోగం చేయరాదు.ఈ నిబంధనలను అనుసరిస్తూ అధికారులు ఏపీ న్యాయవాదులు, వారి గుమస్తా లు ఇబ్బందులు పెట్టరాదని ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు.
ఈ ఉత్తర్వులు ఏపి నుండి హైదరాబాదు కు వెళ్లే న్యాయవాదులందరికీ వర్తిస్తాయని మధ్యంతర ఉత్తర్వులలో తెలిపిన తెలంగాణ హైకోర్టు .