కాలువలోకి దూసుకెళ్లిన కారు..తప్పిన ప్రాణనష్టం

నల్గొండ జిల్లా నిడమనూరులో కారు కాలువలోకి దూసుకెళ్లినా నీరు లేకపోవడంతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే కారణంగా తెలుస్తోంది.

నల్గొండ జిల్లా, నిడమనూరు మండలం ముకుందాపురం కోటమైసమ్మ గుడి సమీపంలో కారు అదుపు తప్పి కాలువలోకి దూసుకెళ్లిన ఘటన చోటుచేసుకుంది. అతివేగం కారణంగా కారు అదుపు తప్పి, నేరుగా ముదిమాణిక్యం మేజర్ కాలువలోకి దూసుకెళ్లింది. అయితే కాలువలో నీరు లేకపోవడం వల్ల కారులోని ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

మరో స్కైలాబ్‌? భూమిపై పడిపోనున్న స్పేస్‌ టెలిస్కోప్‌.. మళ్లించేందుకు నాసా వినూత్న ప్రయోగం
కేరళంలో మరో ఏనుగు భీభత్సం..ఒకరి మృతి

Latest News