సీపీఎం నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ

సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కమిటీ నేతలతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్యలతో భేటీ అయ్యారు

  • Publish Date - April 27, 2024 / 02:42 PM IST

విధాత, హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సీపీఎం రాష్ట్ర కమిటీ నేతలతో భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో సీఎం రేవంత్‌రెడ్డి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్యలతో భేటీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సీపీఎం మద్దతునివ్వాలని సీఎం ఆ పార్టీ నేతలను అభ్యర్థించారు.

ఇండియా కూటమిలో తమ రెండు పార్టీలు కూడా భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో ఉమ్మడి ప్రత్యర్థులైన బీజేపీ, బీఆరెస్‌లను ఓడించేందుకు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు మద్ధతు పలకాలని సీఎం రేవంత్‌రెడ్డి కోరారు. కాగా ఇప్పటికే సీపీఐ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపింది. అయితే సీపీఎం ప్రధానంగా భువనగిరి లోక్‌సభ స్థానంలో పోటీ పడుతుంది. ఇక్కడ ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీలు లాభపడకుండా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతునివ్వాలని కాంగ్రెస్ కోరుతుంది.

Latest News