CPI | హర్యానా, జమ్మూకశ్మీర్లలో బీజేపీకి గుణపాఠం..సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా
లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గించి గుణపాఠం చెప్పినట్లుగానే హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిరచేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా అన్నారు.

జమ్మూ కశ్మీర్ను కేంద్ర పాలితప్రాంతం చేయడం వైఫల్యం
చందబ్రాబు, నితీష్ మద్దతుతో మోదీ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకమే
సెబీ, ఆదాని వ్యవహారంపై జేపీసీ వేయాలి
వైద్య సంస్థల్లో వైద్యులు, సిబ్బంది భధ్రత, రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలి
విధాత, వరంగల్ ప్రతినిధి : లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గించి గుణపాఠం చెప్పినట్లుగానే హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిరచేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ డి.రాజా అన్నారు. 400 లకు పైగా సీట్లు సాధించి తిరుగులేని విధంగా అధికారంలోకి వస్తామని డాంభీకాలు పలికిన బిజెపిని ప్రజలు సగం సీట్లకు తగ్గించి బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినప్పటికీ ఈ ప్రభుత్వం ఎంత కాలం ఉంటుందనేది ప్రశ్నార్థకమేనని అన్నారు. ఎన్డిఎ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన చంద్రబాబు నాయుడు, నితీష్కుమార్ వారి వెంట ఎంత కాలం ఉంటారో కూడా తెలియదని అన్నారు. హన్మకొండలో మూడు రోజుల పాటు జరగనున్న సిపిఐ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాల్లో పాల్గొనేందుకు రాజా గురువారం హన్మకొండకు వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, సయ్యద్ అజీజ్పాషా, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలిసి రాజా మాట్లాడారు.
ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్, బిజెపి రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నాయని విమర్శించారు. దేశంలో తీవమ్రైన సంక్షోభ పరిస్థితులు ఉన్నాయని, రాజ్యాంగాన్ని విస్మరిస్తూ ఉద్యోగ నియామకాల్లో లాటరల్ ఎంట్రీ పేరుతో బిజెపి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పత్రినిధులను బ్యూరోక్రసీలో చొప్పించేందుకు పయ్రత్నం చేస్తుందన్నారు. ఒకే దేశం ఒకే ఎలెక్షన్, ఒకే రిలీజీయన్ అనే నినాదంతో దేశంలో విచ్చిన్న పాలనా సాగించాలని చూస్తున్నాయని మండిపడ్డారు. రాష్ట్రాల హక్కులు, అధికారాలను లాక్కుంటున్నదని, రాజ్యాంగం స్థానంలో కొత్త మతతత్వ రాజ్యాంగం తేవాలని బిజెపి ప్రయత్నం చేస్తున్నదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తూ కేంద్ర పభ్రుత్వం అనుసరించిన విధానం పెద్ద వైఫల్యమన్నారు. అక్కడ ఎన్కౌంటర్లు, దాడులు జరుగుతున్నాయని, బిజెపి పభ్రుత్వం చెప్పిన శాంతి, సాధారణ పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఎక్కడ ఉన్నాయని ఆయన ప్రశ్నించారు.
ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర పభ్రుత్వం కార్పొరేటట్లకు విధేయతను చాటుకుందని, ప్రజల తక్షణ సమస్యల గురించి పట్టించుకోలేదన్నారు. ముఖ్యంగా గణనీయంగా పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను అరికటట్టేందుకు, విద్య, వైద్య, మౌళిక సదుపాయాల కల్పనకు ఎలాంటి నిధులను కేటాయించలేదని ఆయన విమర్శించారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారిందని చెబుతున్న ప్రధాని మోదీ దేశంలో ఉచితంగా రేషన్ ఇచ్చే పరిస్థితి ఎందుకు వచ్చిందో సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అదానీ సంస్థలలో భాగస్వామ్యం కలిగిన సెబి చైర్ పర్సన్ను ఆ పదవి నుంచి తప్పుకోవాలని ప్రధాని మోదీ ఎందుకు కోరడం లేదని, ఈ మొత్తం వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జెపిసి)ని ఏర్పాటు చేసేందుకు మోదీ ఎందుకు వెనుకాడుతున్నారని ఆయన ప్రశ్నించారు. కోల్కతాలో వైద్యురాలిపై జరిగిన ఘటన అత్యంత దారుణమైన నేరమని, దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పండిరదన్నారు. రిజర్వేసన్లు, సామాజాఇక న్యాయాన్ని ఎత్తి వేసేందుకు బిజెపి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆయన విమర్శించారు. ప్రైవేట్ సెక్టార్ లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెజ్లర్ వినేష్ పొగట్ ఒలపింక్లో పాల్గొంటే గోల్డ్ మెడల్ తీసుకువచ్చేదని, బిజెపి కుట్రలలో బలై పోయిందన్నారు. బిజెపి, ఆర్ఎస్ఎస్ శక్తులు అనుసరిస్తున్న ఈ విధానాలను సైద్ధాంతికంగా, రాజకీయంగా, ఎన్నికల పరంగా ఓడించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
– కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలి: కూనంనేని
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నదని, నేటికి గత ప్రభుత్వం సృష్టించిన సంక్షోభాల నుండి బయట పడలేక పోతున్నదని అన్నారు. ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు రైతుల రుణ మాఫీ, గృహ జ్యోతి, గ్యాస్ సబ్సిడీ అందరికి అందేలా చూడాలని, ఇలాంటి విషయాలపై ప్రజా వ్యతిరేకత కూడగట్టుకోవద్దని కోరుకుంటున్నామన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, బీజేపీ రాకూడదని, కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండాలని తాము కోరుకుంటున్నామని అన్నారు. సీపీఐ ని ఒక పోరాట పార్టీగా నిలబెట్టేందుకు హనుమకొండలో రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహిస్తున్నామని, ప్రజాసమస్యలపై చర్చించి, పార్టీ పరంగా శ్రేణులను ఎలా కదిలించాలన్న విషయాలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె. నారాయణ, మాజీ ఎంపీ అజీజ్ పాషా, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, పశ్య పద్మ, బాగం హేమంత రావు,బాలమల్లేష్, కలవేణ శంకర్, బాల నర్సింహా, ఈటి నర్సింహా, వీఎస్ బోస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి. విజయ సారథి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.