విధాత : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పర్యటన, బస్సుయాత్రలపై విమర్శలు చేస్తూ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్లకు కౌంటర్ గా పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి సైతం ట్వీట్ చేయగా వారిద్దరి మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్ తన ట్వీట్లో కాంగ్రెస్ బస్సుయాత్ర తుస్సుమనడం ఖాయమని, సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ, చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అంటు మండిపడ్డారు.
గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని ప్రశ్నించారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని, విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్ కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదన్నారు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీదని, మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాదని, కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరంటు విమర్శించారు.
నిస్సిగ్గు మాటలు
ఎదురుదాడులు
కేరాఫ్ అడ్రస్ డ్రామారావు10 ఏళ్లు అధికారంలో ఉండి
అంట కాగింది మోడీ – కేడీకాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ – కేడీ.
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ – కేడీ
విభజన చట్టంలోని… https://t.co/ZQcrYKSXWy
— Revanth Reddy (@revanth_anumula) October 19, 2023
రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ..తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాదని, నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరన్నారు. కరప్షన్ కు కేరాఫ్ కాంగ్రెస్ అని, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు..ఇక్కడికొచ్చి నీతి వాక్యాలా ? దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరని, ఏకంగా 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాదన్నారు.
శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదన్నారు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణమని ఆరోపించారు. నిన్నఅయినా నేడు అయినా రేపు అయినా..తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అని, గాంధీభవన్ ను గాడ్సేకు అప్పగించిన నాడే తెలంగాణ కాంగ్రెస్ కు కౌంట్ డౌన్ మొదలైందన్నారు. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్ అని, టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబందు రేవంత్ అని విమర్శించారు.
రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది.. ?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్ అన్నారు. మా ప్రభుత్వ రిమోట్ తెలంగాణ ప్రజల చేతిలో పదిలంగా ఉందని, మీ గాంధీభవన్ రిమోటే గాడ్సే చేతిలో మాడి మసైపోతోందన్నారు. మూడు రోజుల పర్యటన చేసినా మూడు వందల రోజులు ముక్కు నేలకు రాసినా…తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను నమ్మరని, వైఫల్యాల కాంగ్రెస్ ను ఎప్పటికీ విశ్వసించరన్నారు.
కాంగ్రెస్ బస్సుయాత్ర…
తుస్సుమనడం ఖాయం…సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ.
చీకటి పాలనకు చిరునామా కర్ణాటక.గత పదేళ్ల కాలంలో..
గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదు.బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదు.
విభజన హామీలపై ఏనాడూ…
— KTR (@KTRBRS) October 19, 2023
మంత్రి కేటీఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కౌంటర్ ట్వీట్ చేస్తూ నిస్సిగ్గు మాటలు, ఎదురుదాడులు, కేరాఫ్ అడ్రస్ డ్రామారావు అంటూ మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోడీ-కేడీలని, కాంగ్రెస్ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు పరిశ్రమకు పాతర వేసింది మోడీ-కేడీలేనంటూ మోడీ, కేసీఆర్లపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును పాతాళానికి తొక్కింది మోడీ-కేడీలేనని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయించలేని దద్దమ్మలం అని నీవే ఒప్పుకుంటున్నావని, తెలంగాణకు ఈ దద్దమ్మ పాలన ఇక అవసరం లేదని రేవంత్రెడ్డి ఘాటుగా కౌంటర్ వేశారు.