విధాత:పదవి విరమణ చేసి వచ్చిన మరుసటి రోజే కరీంనగర్ లో పోలీస్ కేస్ పెట్టారు, వాటికి నేను భయపడనన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.ఆయన మాట్లాడుతూ 29 మంది దళిత ఎమ్మెల్యేలు ఏమి చేస్తున్నారన్నారు.సీఎం హుజరాబాద్ లో ఖర్చు పెట్టే వెయ్యి కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలి,దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీ లలో రెండు శాతం మాత్రమే దళిత ప్రొఫెసర్లు ఉన్నారు.
ఒక్క ప్రవీణ్ మీద కేసు పెడితే కోట్ల ప్రవీణ్ లు పుట్టుకు వస్తారు.బహుజన రాజ్యం సృష్టించుకుంటాము,దళిత ముఖ్యమంత్రి అని ఓట్ల కోసం మోసం చేస్తారు,అలాంటివి మళ్ళీ రానీయకండి ఇటువంటి అవకాశము వెయ్యి ఏళ్లవరుకు రాదు.
స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయింది, మన బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగే వున్నాయి.ఆ బతుకులు మార్చడానికే నేను రాజీనామా చేసి వచ్చాను.మాకు నిజమైన అభివృద్ధి కావాలి, అధికారం కావాలి.మీ బిడ్డ గా ప్రశ్నించడానికి నేను రాజీనామా చేసి వచ్చాను,ఉద్యోగాన్ని వదిలేసి వచ్చినప్పుడు కుటుంబంలో చాలా బాధ ఉంటుంది.కోట్ల మంది బాగుపడాలనే నేను ఒంటరి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను