CROP LOAN WAIVER | రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసిన : సీఎం రేవంత్ రెడ్డి

: 2లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు

CROP LOAN WAIVER | రెండో విడత రైతు రుణమాఫీ నిధులను విడుదల చేసిన : సీఎం రేవంత్ రెడ్డి

లక్ష నుంచి లక్షన్నర వరకు 6,190కోట్ల రుణమాఫీ
11.34లక్షల మందికి లబ్ధి
రెండు విడతల్లో 17.75లక్షల రైతుల 12,225కోట్ల రుణమాఫీ చేసిన వెల్లడి

విధాత, హైదరాబాద్ : 2లక్షల రైతు రుణమాఫీ ప్రక్రియలో భాగంగా రెండో విడత రుణమాఫీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండో విడతలో రూ. ల‌క్షా నుంచి రూ. ల‌క్షా యాభై వేల లోపు రుణాల‌ను మాఫీ చేస్తున్న‌ట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్ర‌క‌టించారు. రెండో విడ‌త‌లో 6.4 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 6,190 కోట్లు జ‌మ చేసిన‌ట్లు పేర్కొన్నారు. తొలి విడతలో 11.34 ల‌క్ష‌ల మంది రైతుల‌కు రూ. 6,035 కోట్లు జ‌మ చేశామని తెలిపారు. రుణ‌మాఫీ ద్వారా ఇప్ప‌టి వ‌ర‌కు 17.75 ల‌క్ష‌ల మంది రైతుల‌కు ల‌బ్ది చేకూరిన‌ట్లు పేర్కొన్నారు. రెండు ద‌శ‌ల్లో క‌లిపి రైతుల ఖాతాల్లో రూ. 12,225 కోట్ల‌ను జ‌మ చేసిన‌ట్లు ప్ర‌భుత్వం తెలిపింది.

రుణ‌మాఫీలో మొద‌టి స్థానంలో నిలిచిన న‌ల్ల‌గొండ జిల్లా..

రెండు విడ‌త‌ల్లో అత్య‌ధికంగా న‌ల్ల‌గొండ జిల్లాకు రూ. 984.34 కోట్లు విడుద‌ల చేశారు. ఈ రెండు విడ‌త‌ల్లో న‌ల్ల‌గొండ జిల్లాలో అత్య‌ధికంగా 1,37,430 మంది రైతులు ల‌బ్ది పొందారు. న‌ల్ల‌గొండ జిల్లా త‌ర్వాత నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లా నిలిచింది. రెండో స్థానంలో నిలిచిన నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాలో రెండు విడ‌త‌ల్లో 80,395 మంది రైతులు ల‌బ్ది పొంద‌గా, రూ. 583.87 కోట్లు విడుద‌ల చేశారు. మూడో స్థానంలో సంగారెడ్డి జిల్లా నిలిచింది. ఈ జిల్లాకు రూ. 563.99 కోట్ల నిధులు విడుద‌ల చేయ‌గా, 77,951 మంది ల‌బ్ది పొందిన‌ట్లు ప్ర‌భుత్వ గ‌ణాంకాలు వెల్ల‌డించాయి.

చివ‌రి మూడు స్థానాల్లో నిలిచిన జిల్లాలు ఇవే..

ములుగు జిల్లాలో 17,788 మంది రైతుల‌కు రూ. 130.94 కోట్లు కేటాయించారు. మేడ్చ‌ల్ మ‌ల్కాజ్‌గిరి జిల్లాలో రెండు విడ‌త‌ల్లో రూ. 15.56 కోట్లు విడుద‌ల చేసి 2,799 మందికి ల‌బ్ది చేకూర్చారు. ఇక చివ‌రి స్థానంలో నిలిచిన హైద‌రాబాద్ జిల్లాలో కేవ‌లం ఏడుగురు రైతులు మాత్ర‌మే ల‌బ్ది పొందారు. తొలి విడ‌త‌లో ముగ్గురు, రెండో విడ‌త‌లో న‌లుగురు రైతులకు ల‌బ్ది చేకూరింది.