TG Employees JAC । లచ్చిరెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ఉద్యోగ జేఏసీలో చేరిన స్టేట్ ఎంప్లాయీస్ స్పౌజ్ ఫోరం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో వేలాదిమంది దంపతులు ఉన్నారు. భర్త ఒక చోట పనిచేస్తుండగా, భార్య మరొక చోట విధుల్లో ఉన్నారు. దంపతులుగా ఉన్న ఉద్యోగుల హక్కులు, వాటి పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డికి వివరించారు.

TG Employees JAC । లచ్చిరెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ఉద్యోగ జేఏసీలో చేరిన స్టేట్ ఎంప్లాయీస్ స్పౌజ్ ఫోరం
  • TG Employees JAC తో జతకట్టిన ఉద్యోగ,ఉపాధ్యాయ దంపతులు
  • తెలంగాణా ఉద్యోగుల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణే ఎజెండా..
  • భారీగా తరలివచ్చిన ఉద్యోగ,ఉపాధ్యాయ దంపతులు

TG Employees JAC । తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంక్షేమం మరియు హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న లచ్చిరెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీలో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ స్పౌజ్ ఫోరం చేరుతున్నట్టు తెలియజేసింది. లచ్చిరెడ్డి నాయకత్వంపై ఉన్న పూర్తి విశ్వాసం,ఆయన క్రియాశీల కార్యదక్షత తెలంగాణ ఉద్యోగ వర్గానికి మార్గనిర్దేశం చేయనుంది.. ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు తెలంగాణ ఎంప్లాయీస్ జాక్ మాత్రమే సరైన వేదిక అని నమ్మి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పౌజ్ ఫోరం నాయకులు తెలియజేశారు.

దంపతులైన ఉద్యోగుల హక్కుల కోసం..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల్లో వేలాదిమంది దంపతులు ఉన్నారు. భర్త ఒక చోట పనిచేస్తుండగా, భార్య మరొక చోట విధుల్లో ఉన్నారు. దంపతులుగా ఉన్న ఉద్యోగుల హక్కులు, వాటి పరిరక్షణ, ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ దంపతులు ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లను తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ లచ్చిరెడ్డికి వివరించారు.అన్ని విషయాలను సావధానంగా విన్న ఆయన సానుకూలంగా స్పందించారు. దంపతులైన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, సత్వర పరిష్కారానికి తెలంగాణ ఎంప్లాయీస్ జాక్ వేదిక ద్వారా తనవంతు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు..ఈ సందర్భంగా స్పౌజ్ ఫోరం సభ్యులు చైర్మన్ లచ్చిరెడ్డిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు కె.రామకృష్ణ , చంద్రకంటి శశిధర్,తెలంగాణ స్పౌజ్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ ఎస్.వివేక్,జనరల్ సెక్రటరీ గడ్డం కృష్ణ,రాష్ట్ర కోఆర్డినేటర్ సోమయ్య గారి నరేష్,విజయలక్ష్మి, వనజ,షహనాజ్ లతో పాటు పలు జిల్లాల నుంచి తరలివచ్చిన ఉద్యోగ, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు