ఎమ్మెల్సీ విఠల్‌ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

బీఆరెస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నికల చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలైకు వాయిదా వేసింది

ఎమ్మెల్సీ విఠల్‌ ఎన్నిక చెల్లదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే

విధాత: బీఆరెస్‌ ఎమ్మెల్సీ దండె విఠల్‌ ఎన్నికల చెల్లదన్న తెలంగాణ హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలైకు వాయిదా వేసింది. 2022లో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన దండె విఠల్ ఎన్నిక చెల్లదని తెలంగాణ హై కోర్టు ప్రకటించింది. ఫోర్జరీ సంతకాలతో దండె విఠల్ తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలిచ్చారని కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

దండె విఠల్ ఎన్నిక అక్రమని, ఆయన శాసన మండలి సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాజేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. దండే విఠల్ ఎన్నిక చెల్లదని తీర్పు వెలువరించింది. ఎన్నిక రద్దు చేయడంతో పాటు దండే విఠల్‌కు రూ.50 వేల ఫైన్ విధించింది. తెలంగాణ హైకోర్టు తీర్పును ఎమ్మెల్సీ విఠల్ సుప్రీంకోర్టులో చాలెంజ్ చేశారు. ఎన్నిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన ధర్మాసనం హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చింది.