KTR | జయశంకర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన సాగింది.. ఢిల్లీలో జయంతి కార్యక్రమంలో నివాళులర్పించిన కేటీఆర్, హరీశ్రావు
తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని బీఆరెస్ కార్యాలయంలో జయశంకర్ సర్ జయంతి

విధాత, హైదరాబాద్ : తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సర్ స్ఫూర్తితోనే తెలంగాణలో కేసీఆర్ పాలన నడిచిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని బీఆరెస్ కార్యాలయంలో జయశంకర్ సర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించిన కేటీఆర్, హరీష్ రావులు నివాళలుర్పించారు. వారిటో పాటు ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ ఎంపీలు దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, పలువురు బీఆరెస్ నేతలు కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమానికి మొదటి నుండి జయశంకర్ అండగా ఉన్నారన్నారు. ఢిల్లీలో కేసీఆర్ తో కలిసి జయశంకర్ 36 పార్టీలను ఒప్పించి తెలంగాణకు అనుకూలంగా లేఖలు ఇప్పించారని గుర్తు చేసుకున్నారు. జయశంకర్ సార్ స్ఫూర్తితోనే కేసీఆర్ పదేళ్ల పాలన సాగిందన్నారు. జయశంకర్ పేరుతో జిల్లాను ఏర్పాటు చేసుకున్నామని, వ్యవసాయ యూనివర్సిటీకి జయశంకర్ పేరు పెట్టుకున్నామని గుర్తు చేశారు.