విధాత,హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.సాక్షుల వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేస్తోంది.ఇప్పటికే స్టీఫెన్ సన్ గన్మెన్లు నీరజ్ రావు, రఘునందన్ వాంగ్మూలాలను ఏసీబీ కోర్టు నమోదు చేసింది. రేవంత్ రెడ్డి అప్పటి గన్మెన్లను నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది.జూలై 13 వరకు 18 మంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసేందుకు న్యాయస్థానం షెడ్యూల్ ఖరారు చేసింది.